లోకేష్ లో పెరిగిపోయిన ఫ్రస్ట్రేషన్ ... ఏ స్ధాయిలో ఉందో తెలుసా ?
తీవ్ర ఆర్థిక నేరగాడైన జగన్ గారికి కోర్టు మినహాయింపు దక్కలేదు. కోర్టులను రద్దు చేస్తారా? లేదా ప్రతీ శుక్రవారం వెళ్లక తప్పదని శుక్రవారాన్ని తీసేసి వారానికి ఆరు రోజులే అని జీవో తెస్తారా?(3/3)
— lokesh Nara (@naralokesh) January 27, 2020అప్పటి నుండి జగన్ పై ఇద్దరిలోను ఉక్రోషం రోజురోజుకు పెరిగిపోతోంది. తాజాగా రాజధానిగా అమరావతిని తరలించేయాలన్న ప్రతిపాదనతో పాటు శాసనమండలిని కూడా రద్దు చేసేయాలన్న తీర్మానంతో ఇద్దరికీ ఏం మాట్లాడాలో అర్ధం కావటం లేదు. తొందరలోనే తన సభ్యత్వం పోవటంతో పాటు టిడిపి సభ్యులందరి పదవులూ ఊడిపోవటం ఖాయమని తేలిపోవటంతో నోటికొచ్చినట్లు లోకేష్ మాట్లాడుతున్నారు. శాసనమండలి రద్దు విషయంలో లోకేష్ ప్రశ్నించాల్సింది జగన్ ను కాదు తన తండ్రి చంద్రబాబునే. ఉద్దేశ్యపూర్వకంగానే మెజారిటి ఉంది కదాని ప్రతి బిల్లును టిడిపి మండలిలో అడ్డుకుంటోంది. మొన్నటి బిల్లుల విషయంలో కూడా ఛైర్మన్ ను మ్యానేజ్ చేసుకుని టిడిపి తొండాటాడింది. దానితో జగన్ కు మండిది. శాసనమండలికి మూడింది. ఆ ఫ్రస్ట్రేషనే లోకేష్ లో ట్విట్టర్ రూపంలో బయటపడింది.