ఆ రెండు రంగాల్లో సమూల మార్పులను ఆశిస్తున్న జగన్

DRK Raju
ఉద్యోగాల భర్తీ కోసం క్యాలెండర్‌పై క్యాంపు కార్యాలయంలో సీఎం వైయస్‌.జగన్‌ సమీక్ష. హాజరైన మంత్రి కొడాలి నాని, సీఎస్, డీజీపీ ఇతర ఉన్నతాధికారులు, అధికారులు. వైద్య, విద్యా రంగాల్లో సమూల మార్పులను ఆశిస్తున్నాం. వీటిలో అవసరమైన ఉద్యోగాలన్నింటినీ భర్తీచేయాలి. పోస్టుల సంఖ్య, అవి శాంక్షన్‌ చేశారా లేదా అనే దానికన్నా అవసరాల మేరకు ఈ రెండు విభాగాల్లో సిబ్బందిని ఉంచాలి.  ఆమేరకు ఉద్యోగులను భర్తీచేయాలి. విద్యా, వైద్య రంగాల్లో ఖాళీలు ఉంచకుండా ముందు వాటిని భర్తీ చేయాలి. అలాగే పోలీసు విభాగంలో మనం వీక్లీ ఆఫ్‌లను ప్రకటించాం. దీన్ని సమర్థవంతంగా అమలు చేయడానికి అవసరమైన సిబ్బందిని నియమించాలి.

ఆస్పత్రికి ఎవరైనా పోతే.. ఉండాల్సిన సిబ్బంది లేకపోతే.. ఆస్పత్రి నిర్వహించీ వృథా అవుతుంది. ఇప్పటికే నాడు–నేడు ద్వారా మనం ఆస్పత్రులను బాగుచేయడానికి ముందడుగు వేస్తున్నాం. అందుకే డాక్టర్లు, నర్సులు, ల్యాబ్‌టెక్నిషియన్లు, ఫార్మసిస్టుల పోస్టుల భర్తీపై దృష్టిపెట్టాలి. అలాగే స్కూళ్లలో కూడా నాడు–నేడు చేపడుతున్నాం. సరిపడా సిబ్బంది లేకపోతే.. మనం స్కూళ్లపై ఇంత డబ్బు ఖర్చుపెట్టిన వృథా అవుతుంది. టీచర్లు సరిపడా లేకపోతే స్కూలు సమర్థత తగ్గుతుంది.

స్కూళ్లలో ల్యాబ్‌ టెక్నీషియన్లుకూడా ఉండాలి. అప్పుడే స్కూళ్లలో మనం చేపడుతున్న ఆధునీకరణ పనులు, అమ్మ ఒడి, మధ్యాహ్న భోజనంలో నాణ్యతల కోసం తీసుకున్న చర్యలకు అర్థం ఉంటుంది. అలాగే పోలీసు విభాగంలో వీక్లీ ఆఫ్‌లు ప్రకటించాం. దీనివల్ల వారి ఆ శాఖ సామర్థ్యం తగ్గకూడదు. ఇలా ఆలోచనలు చేసి ప్రాధాన్యతలు నిర్ధారించుకుని ఆమేరకు చేపట్టాల్సిన భర్తీపై కార్యాచరణ రూపొందించుకోవాలి.

రెవిన్యూ విభాగంలో కూడా ప్రాధాన్యమైన పోస్టుల భర్తీపై దృష్టిపెట్టాలన్న సీఎం. రెవిన్యూ డిపార్ట్‌మెంటులో సర్వే సిబ్బందికి అవసరమైన పరికరాలను సమకూర్చండి. ప్రభుత్వంలోని ప్రతి విభాగంతోనూ కూర్చొని ప్రాధాన్యతా క్రమంలో భర్తీ చేయాల్సిన పోస్టులపై చర్చించాలని సీఎం ఆదేశం. మరో మూడు వారాల్లో పూర్తిస్థాయి పరిశీలన చేసిన ప్రాధాన్యతా పోస్టులను నిర్దారిస్తామని, వాటిని ఏయే విభాగాల ద్వారా భర్తీ చేస్తామో ఒక ప్రణాళిక రూపొందిస్తామని సీఎంకు చెప్పిన అధికారులు. ఫిబ్రవరి 21న ముఖ్యమంత్రితో మరోసారి సమావేశమై ఉద్యోగాల భర్తీపై కార్యాచరణ తెలియజేయనున్న అధికారులు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: