రాజధానిని మార్చేది ఇందుకా..?.. అసలు తెలిస్తే నవ్విపోతారుగా.
అమరావతిలో అన్ని పథకాలు జరుగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని అభివృద్థి కార్యక్రమాలు జరుగుతున్నాయి. చంద్రబాబు మాత్రం భ్రమలు కల్పించే ఉద్యమం చేస్తున్నారు. చంద్రబాబుది నాలికా.. తాటిమట్టా..?. జనసేన లెటర్ హెడ్లు కూడా టిడిపి వద్దే వుంటున్నాయోమేనని అనిపిస్తోంది. కియో మోటర్స్ వెళ్ళిపోతోందని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. టిడిపి వారు చేస్తున్నవన్నీ పిల్లి శాపాలే. మీడియాను మేనేజ్ చేయడం చంద్రబాబుకు అలవాటు. కియా సంస్థకు ప్రభుత్వం ఎటువంటి ప్రతికూల వాతావరణం సృష్టించలేదు. చంద్రబాబు కల్పించిన ప్రతికూల వాతావరణం నుంచి ప్రభుత్వంను జగన్ నడుపుతున్నారు. మాకు అధికారంను అప్పగించిన సమయంలో అరవై వేల కోట్ల బిల్లులు పెండింగ్ లో వున్నాయి. రూ. 2.50 లక్షల కోట్లు అప్పులు చేశారు.. ఈ నిధులన్నీ ఎం చేశారో తెలియదు. అసలు మనుషులు లేకుండా.. కుటుంబాలు లేకుండా అమరావతిని ఎలా భూతల స్వర్గం చేస్తారు. .జూబ్లీ హిల్స్ తరహాలో ఈ ప్రాంతంను అభివృద్థి చేయవచ్చని భావించారు. ఈ మొత్తం భూమిలో రెసిడెన్షియల్ ప్లాట్లు వున్నాయి. ఒకవేళ మంచి రేటు వస్తే... ముందు ఈ ప్లాట్ లకే వస్తుంది. రైతులకు ఇచ్చిన ప్లాట్ లకు రేటు తక్కువ వస్తుంది. చంద్రబాబు చేసిన ఈ మోసాన్ని రైతులు ఎలా నమ్మారు?. ఓవైపు ప్రధాన ప్రాంతాన్ని ఫారెన్ కంపెనీలతో అభివృద్ధి చేయించి. మీ వెయ్యి గజాలకు రూ.1.40 కోట్లు వస్తుందని చెప్పి రైతులను మోసం చేశాడు.