ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే  ఐటి కంపెనీలకు ఎక్కడా దెబ్బ తగల్లేదు. మాజీ పిఎస్ పై జరిగిన ఐటి దాడుల సమాచారాన్ని డైవర్ట్ చేయటానికే ఇటువంటి బోగస్ కథనాన్ని అచ్చేసినట్లు అర్ధమైపోతోంది.  పైగా అనంతపురంలో కియా కార్ల ఉత్పత్తి ప్లాంటు తమిళనాడుకు తరలిపోతోందంటూ అంతర్జాతీయ మీడియా సంస్ధ రాయటర్స్ లో వచ్చిన కథనం తప్పుడదని తేలిపోయింది. కియా మోటార్స్ తరలింపు కథనం ఎంత తప్పుడుదో శ్రీనివాస్ ఇల్లు, ఆఫీసులపై ఐటి దాడులు అంతే సంచలనం.