మోడీపై జగన్ సమరశంఖం: అందు కోసమేనా..?
రైతుల ఆదాయం పెరగాలంటే పాడి పరిశ్రమను మరింత ప్రోత్సహించాలని సూచించాను. ఉపాధి హామీ పథకానికి గతంలో రూ.81 వేలు కోట్లు కేటాయించగా ప్రస్తుతం రూ.61వేల కోట్లు మాత్రమే బడ్జెట్లో ఇచ్చారు. ఇలా కాకుండా ఈ పథకానికి నిధులు గణనీయంగా పెంచాల్సి ఉందని చెప్పాము. అమ్మ ఒడి, నాడు నేడు పథకాలకు కేంద్రం నిధులు కేటాయించాలని కోరాను. ఆంధ్ర ప్రదేశ్ లో విద్యాభివృద్ధికి..విభజన చట్టం ప్రకారం ఏర్పాటు చేయాల్సిన 12 జాతీయ సంస్థలకు త్వరగా నిధులు కేటాయించాలని కోరాను.
ఆంధ్రా జీవనాడి అయిన పోలవరం పూర్తికి కేంద్రం నిధులు మంజూరు చేయాలని కోరాను. 55 వేల కోట్ల రూపాయల ప్రాజెక్ట్ అంచనాల్ని త్వరగా ఆమోదించాలని కోరాను. వైఎస్సార్ కడప జిల్లాలో ఏర్పాటు చేసే స్టీల్ ప్లాంట్, 4 స్మార్ట్ నగరాలకు రావాల్సిన నిధులను త్వరగా విడుదల చేయాలని అడిగాము. విశాఖ - చెన్నై పారిశ్రామిక కారిడార్, ఇంటిగ్రేటెడ్ వాటర్ గ్రిడ్ ప్రాజెక్ట్ లకు బడ్జెట్ లో కేటాయింపులు చేయాలని అడిగాము. అన్నిటికంటే ముఖ్యంగా రాష్ట్రం సర్వతో ముఖాభివృధికి తోడ్పడని కేంద్రాన్ని ఆయన కోరారు .