అనుకున్నది ఒక్కటి అయ్యిందొక్కటి అంటే ఇదేనేమో. మనం ఏదో అనుకుని చేస్తాం కానీ కొన్నిసార్లు మన అంచనాలు తారుమారు అవుతాయి. ఇక పెళ్ళయ్యాక అక్రమసంబంధాలనేవి చాలా డేంజర్ అనే చెప్పాలి. ఇంట్లో భార్యా భర్తలకు తెలియడం వల్ల అన్నీ అనర్ధాలే ఎదురవుతాయి. ఏ పని చేసినా ఆలోచించి చేయాలి లేదంటే జీవితాలు నాశనమయ్యే సంఘటనలు ఎన్నో జరుగుతాయి. ఇలాంటి ఘటనే ఒకటి ఒంగోల్లో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే... ప్రకాశం జిల్లా అద్దంకి పట్టణంలోని ఎన్టీఆర్ కాలనీకి చెందిన గుంజి వేణుబాబు, ధనలక్ష్మి భార్యాభర్తలు. వేణుబాబు మేస్త్రీగా పనిచేస్తుంటాడు. ఈ క్రమంలో నాగులపాడుకి చెందిన వెంకట్రావు భార్య మల్లేశ్వరిలో వేణుబాబుకి పరిచయం ఏర్పడింది. అది కాస్తా అక్రమ సంబంధానికి దారితీసింది. తరచూ కలుసుకుని రాసలీలలు సాగించేవారు.
ఇక ఇదిలా ఉండగా ఓ రోజు పని మీద వేణుబాబు కుటుంబం అంతా హైదరాబాద్ వచ్చేసి అక్కడే వాచ్మేన్గా జీవనం సాగిస్తున్నారు. ఇంతలో అయినా కూడా ప్రియురాలు మల్లేశ్వరి మాత్రం ఎప్పుడూ వేణుబాబుతో ఫోన్లో మాట్లాడుతూ ఉండేది. తరచు అక్కడికి వస్తూ ఉండేది. ఓసారి తనను కలడం కోసం హైదరాబాద్ రాగా భార్యకు సినిమాకు వెళుతున్నా అని చెప్పి వేణు ఇంట్లోంచి బయలు దేరాడు. భార్యకు అనుమానం వచ్చి తన బ్యాగ్ చెక్ చేయగా అందులో మల్లీశ్వరితో దిగిన ఫొటో చూసి భార్య భర్తతో గొడవ పెట్టుకుంది. ఓ పక్క ప్రియురాలు వేణుబాబుని పెళ్ళి చేసుకోమని వేణుబాబుని ఇబ్బంది పెడుతుంది. కానీ వేణు పెళ్ళి చేసుకోవడానికి ప్రియురాలి దగ్గరకి వెళ్ళగా భార్య విషయాన్ని తెలుసుకుని పురుగుల మందు తాగుతుంది.
ఆ విషయం తెలియగానే భర్త ప్రియురాలికి నచ్చచెపుతాడు మన ఇద్దరికీ ఆల్రెడీ పెళ్ళై పిల్లలున్నారని ఇప్పుడు పెళ్ళి చేసుకోవడం సరికాదని చెపుతాడు కానీ దానికి వెంటనే ప్రియురాలు బైక్ పైన తిరిగి అద్దంకి వస్తున్న సమయంలో గుండ్లకమ్మ బ్రిడ్జి దగ్గర పక్కన ఆపమని చెప్పి నువ్వులేనిదే నేను బ్రతకలేనంటూ బ్రిడ్జి మీద నుంచి దూకేస్తుంది. దీంతో ప్రియురాలిని కాపాడదామని ప్రియుడు కూడా దూకుతాడు. అయితే ఇది గమనించిన స్థానికులు వెంటనే రక్షించడానికి ప్రయత్నిచగా ప్రియురాలు కొనూపిరితో ఉంటుంది. వెంటనే ఆసుపత్రికి తీసుకువెళ్ళగా ప్రియుడిని వెతికగా ప్రియుడు శవమై తేలతాడు. అయితే ఆల్రెడీ చావు బ్రతుకుల మధ్యలో ఉన్న భార్యకు ఈ విషయం ఇంకా తెలియదు.
మరింత సమాచారం తెలుసుకోండి: