ఎంత ప్రస్టేషన్ ఉంటే మాత్రం.. ప్రజలనంటే ఎలా బాబు!
అంతేకాదు ఈ అంశాల మీద విస్తృత స్థాయిలో చర్చ జరగాలని అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా అమరావతి ఉద్యమం గురించి మాట్లాడుతూ ఈ ఉద్యమాన్ని పూర్తిగా మహిళలే ముందుండి నడిస్తున్నారన్నారు. విశాఖలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దాదాపు 33 వేల ఎకరాల ఆక్రమించారని, అందుకే రాజధానిని అక్కడి తరలించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. తాజాగా ఏప్రీ ప్రభుత్వం విధ్యుత్ చార్జీలు పెంచుతూ తీసుకున్న నిర్ణయాన్ని కూడ ఆయన తప్పుపట్టారు. విధ్యుత్ చార్జీల పెంపుతో దాదాపు 1300 కోట్ల భారం ప్రజలపై పడుతుందన్నారు. జగన్ ప్రభుత్వం ఏర్పడిన 9 నెలల కాలంలో 1.80 లక్షల కోట్ల పెట్టుబడులు వెనక్కిపోయాయని, దాదాపు 18 లక్షల రేషన్ కార్డులు తొలగించారిన ఆరోపించారు. అయితే జగన్ ప్రభుత్వం మాత్రం టీడీపీ నాయకుల కేసల విషయంలో దూకుడుగా వ్యవహరిస్తోంది. చంద్రబాబు, నారా లోకేష్ సన్నిహితుల అక్రమాలను ఒక్కొక్కటిగా బయట పెడుతూ వస్తోంది. వరుసగా ఐటీ దాడులు, కోర్టు కేసులతో బాబు అండ్ టీం ఉక్కిరిబిక్కిరవుతోంది.