హ్యాపీ సండే 23-FEB: ఏపీ పాలిటిక్స్లో ఈ వారం హీరోలు...!
స్కాంలో గత ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్న కొంతమంది ఇన్వాల్వ్ అయ్యారన్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లటంతో జగన్ ప్రభుత్వం సక్సెస్ అయ్యింది. ఇప్పటికే పీకల్లోతు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీపీ నాయకులు తాజా పరిణామాలతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. స్వయంగా అచ్చెన్నాయుడు లెటర్ ఇచ్చి మరి క్రాంటాక్ట్ తనకు సంబంధించిన కంపెనీకి ఇప్పించుకున్నాడని పక్కా ఆదారాలు బయటపడటంతో ఏం చేయాలో పాలుపోక ఇబ్బంది పడుతున్నారు.
మరోవైపు సచివాలయం తరలింపు విషయంలోనూ ప్రతిపక్షానికి ఝలక్ ఇచ్చింది జగన్ గవర్నమెంట్. గత కొద్ది రోజులుగా తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియాలో ఓ వార్త ప్రముఖం వినిపించింది. వైజాగ్లోని మిలీనియం టవర్స్ లో సచివాలయం ఏర్పాటుకు నేవీ అధికారులు అభ్యంతరం తెలిపినట్టుగా ఓ వర్గం మీడియా ప్రచారం చేసింది. అయితే వార్తలపై వైసీపీ ప్రభుత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేసింది. నేవీ అధికారుల తోనే తమకు ఎలాంటి అభ్యంతరం లేదంటూ స్టేట్మెంట్ ఇప్పించి తెలుగుదేశం పార్టీ మీద మరో బాంబు వేసింది.