పార్టీ అంటే.. వాడుకో.. అనుభవించు.. వదిలేయ్... ఆ నాయకుడి తీరు అంతేనా....?
గురువారం రోజు రోజంతా కూడా విశాఖ విమానాశ్రయం అట్టుడికింది. టీడీపీ అధినేత చంద్రబాబును నగ రంలోకి అడుగు పెట్టకుండా జరిగిన ఈ పరిణామంపై పార్టీలకు అతీతంగా కూడా కొందరు స్పందించారు. ఇక, టీడీపీనాయకులు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చారు. చంద్రబాబును అవమానించా రంటూ.. ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. నల్లజెండాలు పట్టుకుని నినాదాలు చేశారు. అయితే, కీలకమైన విశా ఖలో మాత్రం ప్రధాన నాయకులు ఎవరు కూడా ముందుకు రాలేదు. బాబుకు జరిగిన పరాబవంపై ఎవరూ నోరు కూడా మెదపలేదు. మరీ ముఖ్యంగా గతంలో పదవులు అనుభవించిన గంటా శ్రీనివాసరావు కూడా బయటకు రాలేదు.
దీంతో.. విశాఖ టీడీపీ నేతలు.. పార్టీని వాడుకుని.. అనుభవించి.. వదిలేయడమనే కాన్సెప్టును ఎంచుకు న్నారనే వాదన బలంగా వినిపిస్తోంది. ఇప్పటి వరకు కూడా విశాఖ టీడీపీ నుంచి ఏ ఒక్కరూ మీడియా ముందుకు కూడా రాలేదు. గతంలో విశాఖలో జగన్ను అవమానించినప్పుడు.. వైసీపీ నాయకులు ము ఖ్యంగా విశాఖకు చెందిన నాయకులు కనీసం ఒకరిద్దరు మీడియా ముందుకు వచ్చి నిరసన తెలిపారు. కానీ, ఇప్పుడు చంద్రబాబుకు ఇంత పెద్ద అవమానం జరిగితే.. స్పందించేందుకు నాయకులు లేరా? ఉన్నా రాలేదా? అంటే .. రాలేదనే చెప్పాలి. విశాఖలో నాలుగు సీట్లు గెలుచుకున్న సంతోషం కన్నా.. ఇప్పుడు ఎదురైన ఆవేదన పార్టీని మరింతగా కుంగదీస్తోందని అంటున్నారు పరిశీలకులు.