నిజానికి మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ నేతృత్వంలో ఏర్పడిన ప్రభుత్వం తక్కువ మెజారిటితోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగింది. అధికార-ప్రతిపక్షాల మధ్య ఉన్న తేడా చాలా చాలా తక్కువనే చెప్పాలి.  ప్రతిపక్షానికన్నా సుమారుగా ఉంటే ఓ ఐదుగురు ఎంఎల్ఏలకన్నా తేడా ఉండదు. 230 ఎంఎల్ఏలున్న అసెంబ్లీలో కాంగ్రెస్+ బలం 114 అయితే, ప్రతిపక్ష కమలం పార్టీ బలం 109 మాత్రమే. అంటే అధికార-ప్రతిపక్షాల మధ్య బలంలో తేడా కేవలం ఐదుగురు ఎంఎల్ఏలు మాత్రమే. కాకపోతే ఓ ఏడుగురు ఎంఎల్ఏలు ఇతరుల కోటాలో గెలిచారు లేండి.