బ్రేకింగ్: ఇండియాలో కోరలు చాస్తోన్న కరోనా.... బాధితుల కౌంట్ ఇదే...!
ముందుగా ఇటలీ నుంచి వచ్చిన టూరిస్టుకు కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. అలాగే మరో 15 మంది టూరిస్టులకు వైరస్ నిర్ధారణ పరీక్షలు చేశారు. వారికీ కూడా కరోనా వైరస్ లక్షణాలు ఉన్నట్టు తేలింది. ఇక హైదరాబాద్కు చెందిన ఓ 24 ఏళ్ల యువకుడు బెంగళూరులో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. సదరు బాధితుడు కంపెనీ వ్యవహారాలపై దుబాయ్ వెళ్లాడు. అక్కడ నుంచి తన టీంతో కలిసి హాంకాంగ్కు వెళ్లాడు. అక్కడ నుంచి వచ్చిన వెంటనే ఆ యువకుడు జ్వరంతో బాధపడుతున్నాడు.
ఈ యువకుడికి పరీక్షలు చేయగా కరోనా పాజిటివ్ అని తేలింది. ఇక తాజాగా బుధవారం మరో 15 మందికి కూడా కరోనా సోకినట్టు గుర్తించారు. 15 మంది ఇటాలియన్ పర్యాటకులు, వైరస్ కోసం పాజిటివ్ పరీక్షలు చేయించుకున్నారని, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ధృవీకరించింది. వీరికి కూడా కరోనా వైరస్ సోకినట్టు నిర్దారణ కావడంతో మనదేశంలో కరోనా వైరస్ సోకిన కేసులు అధికారికంగా లెక్క తేలినవి 21 కి పెరిగాయి. ఇక తెలంగాణలో కరోనా విజృంభిస్తోందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.