కేటిఆర్ గారూ నేను తెలంగాణా గడ్డ మీద పుట్టా, నాకు న్యాయం చేయండి అంటూ రాహుల్ సిప్లిగంజ్ ట్వీట్...!
ఇక ఇప్పుడు తన మీద దాడి చేసిన వాళ్ళ మీద తెలంగాణా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నాడు. దాడి ఘటన నుంచి ఇప్పుడే బయటకు వస్తున్న ఈ యువ సింగర్ ఇప్పుడు ఏకంగా కేటిఆర్ కి ట్వీట్ చేసాడు. తెలంగాణా పురపాలక శాఖా మంత్రిగా ఉన్న కేటిఆర్ తనకు న్యాయ౦ చెయ్యాలని అతను కోరాడు. తన మీద దాడి జరిగిన వీడియో ని పోస్ట్ చేస్తూ పైన ఫిర్యాదు కూడా రాసాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇది అని పేర్కొంటూ... తన మీద ఈ గ్యాంగ్ ఏ విధంగా దాడి చేసిందో చూడాలని కోరాడు.
దయచేసి ఈ వీడియో చూడాలని కేటిఆర్ ని కోరాడు. అలాగే మీరు న్యాయం వైపు నిలబడాలి అంటూ... మీకు ఏది న్యాయం అనిపిస్తే అది చెయ్యాలి అంటూ ట్వీట్ చేసాడు. తాను తెరాస కు ఓటు వేసా అని చెప్పాడు ఆ ట్వీట్ లో. తాను ఈ తెలంగాణా గడ్డ మీద పుట్టా అని... బ్రతికి ఉన్నన్ని రోజులు తెలంగాణకు సేవ చేస్తా అని ట్వీట్ లో పేర్కొన్నాడు.
please see it for yourself & stand for what is right!@KTRTRS sir, I always stood for trs party & I vote for trs alone because I am born on this land & I will serve telangana as long as I live.#ineedjustice pic.twitter.com/8LQ3PGEBwe