మంత్రి పదవిపై ఇష్టాన్ని బయటపెట్టిన రోజా...!

Gullapally Rajesh

2014 ఎన్నికల్లో పోటీ చేసి ఎంఎల్ఏ గా గెలుపొంది, తరువాత 2019 ఎన్నికల్లో కూడా విజయం సాధించిన సినీ నటి, ఏపి ఐ ఐ సి  చైర్ పర్సన్  రోజా మంత్రి పదవి కోసం ఎదురు చూస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే రోజాకు మంత్రి పదవి ఎప్పుడు వస్తుంది అంటే దానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఒక్కరే సమాధానం చెప్పాలి. ఆయన చెప్పరు, మనకు తెలియదు. ఇక రోజా మంత్రి పదవి గురించి ఇప్పుడు అటు సోషల్ మీడియా లోనూ, ఆమె జడ్జిగా వ్యవహరించే రియాలిటీ షోలో కూడా ఎన్నో జోక్స్ పేలుతున్నాయి. 

 

తాజాగా ఈ నేపథ్యంలో  ఆమె మంత్రి పదవి పై జబర్దస్త్ షో లో అద్భుతమైన స్కిట్ వేశారు. ఈ వారం రిలీజ్ అయిన జబర్థస్త్  ప్రోమో నీ చూస్తే  అందులో శాంతి స్వరూప్ మంచి కామెడీ పండించాడు. అదేమిటి అంటే ఎవరితోనైనా కొట్టించు కుంటేనే అతని సెంటిమెంట్ పండుతుంది. ఈ క్రమంలో గెటప్ శ్రీను తో తన్నులు తింటాడు. ఆ తరువాత అతిథిగా వచ్చిన విష్వ క్సేన్ నీ కొట్టమని బతిమిలాడతాడు. అటుపై రోజా దగ్గరకు వచ్చి  తనను కొట్టాలని కోరాడు. ఆ సమయంలో లోనే ఫసక్ శసి రోజా దగ్గరకు వచ్చి  ' మేడం మీరు తనని కొడితే మీకు మంత్రి పదవి పక్కా' అంటాడు.

 

ఈ నేపథ్యంలో  రోజా కర్ర తీసుకుని శాంతి స్వరూప్ ను చితక బాదింది. దీనితో ఇప్పుడు సోషల్ మీడియాలో కొందరు పలు కామెంట్లు చేస్తున్నారు. ఆమెకు మంత్రి పదవి అంటే ఎంత ఇష్టమో అర్ధమవుతుందని అందుకే ఆమె లక్ ట్రై చేసుకున్నారని మరికొందరు అంటున్నారు. కాగా త్వరలో కేబినేట్ విస్తరణ జరుగుతుందని, ఆ విస్తరణలో ఆమెకు మంత్రి పదవి రావడం ఖాయమని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఆమెకు మంత్రి పదవి వస్తుందో రాదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: