నాడు పవన్పై సవాల్ చేసిన పచ్చ పార్టీ లీడరు... నేడు ఫ్యాన్ కిందకు వచ్చేస్తున్నాడా...!
ఇక గుంటూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ ఇప్పటికే వైసీపీలో చేరారు. సోమవారం డొక్కా జగన్ సమక్షంలోనే వైసీపీ కండువా కప్పుకున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు మరో మాజీ ఎమ్మెల్యే సైతం వైసీపీ కండువా కప్పుకునేందుకు రెడీ అయినట్టు వార్తలు వస్తున్నాయి. ఆ మాజీ ఎమ్మెల్యే ఎవరో కాదు విశాఖ జిల్లా గాజువాక మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు. 2014లో పల్లా ప్రజారాజ్యం పార్టీ నుంచి గంటా ద్వారా టీడీపీలోకి వచ్చి పోటీ చేసి ఓడిపోయారు.
ఇక గత ఎన్నికలకు ముందు పల్లా గాజువాకలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్పైనే పోటీకి దిగారు. ఈ ఎన్నికల్లో పల్లా ఓడినా రెండో స్థానంలో ఉండగా... పవన్ ఏకంగా మూడో స్థానంతో సరిపెట్టుకున్నారు. పల్లాకు టీడీపీలో ప్రయార్టీ లేకపోవడం.. అయన్ను పట్టించుకునే నాథుడు లేకపోవడంతో పల్లా ఫ్యాన్ కిందకు చేరడానికి రంగం సిద్ధమైంది. వైజాగ్ కార్పొరేషన్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఎంపీ విజయ సాయిరెడ్డి ఆయన్ను పార్టీలోకి ఆహ్వానించగా ఓకే చెప్పినట్టు సమాచారం. ఇక పల్లాతో పాటు మరి కొందరు టీడీపీ కీలక నేతలు కూడా పార్టీ కండువాలు కప్పుకునేందుకు సిద్ధమయ్యారట.