నామినేషన్ వేసిన వారిని దాచిపెట్టడమేమిటి బాబూ?
చంద్రబాబు ఎవరికైన భయపడుతాడు అంటే అది ఖచ్చితంగా విజయసాయి రెడ్డికి అనే చెప్పాలి.. ప్రత్యేక్షంగా అయినా పరోక్షంగా అయినా చంద్రబాబును విజయసాయి మాటలతోనే ముప్పుతిప్పలు పెట్టేస్తారు.. విజయసాయి సెటైర్లకు చంద్రబాబు ముఖం తిప్పేసుకుంటారు.. ఒక్క చంద్రబాబుపైనే కాదు.. అతని సుపుత్రుడు లోకేష్ పైనా అతను జాతీయ అధ్యక్షుడుగా వ్యవహరిస్తున్న పార్టీ నేతలపై కూడా ఆ రేంజ్ లోనే సెటైర్లు వేస్తుంటారు విజయ సాయి రెడ్డి.
ఇక ఈ నేపథ్యంలోనే స్థానిక ఎన్నికల గురించి అయన సంచలన ట్విట్లు చేశారు. అది ఎలాగంటే? టీడీపీ నేతలు నామినేషన్లు వెయ్యడానికి ఒకొక్కరికి 5 నుండి 10 లక్షలు ఇచ్చారు అని.. గెలిచే సిన్ లేక వాళ్ళు ఎక్కడ ఉపసంహరించుకుంటారో అని క్యాంపులకు తరలిస్తున్నారు అని సంచలన వ్యాఖ్యలు చేశారు.
అంతేకాదు గెలిచినా వాళ్ళు రహస్య స్థావరాలకు తీసుకెళ్లడం గురించి విన్నాం... కానీ.. నామినేషన్ వేసిన వారిని దాచిపెట్టడమేమిటి బాబూ? అని విజయసాయి రెడ్డి వారిపై సెటైర్ వేశారు. ఆ ట్విట్ చుసిన నెటిజన్లు కూడా ఓ రేంజ్ లో కామెంట్ చేస్తున్నారు. అసలు విజయసాయి రెడ్డి ఎం అని ట్విట్ చేశారు అంటే?
విజయసాయి రెడ్డి ట్విట్ చేస్తూ... ''టిడిపికి అభ్యర్థులు దొరకక 5 నుంచి 10 లక్షలు ముట్టచెప్పి నామినేషన్లు వేయించారు. గెలిచే సీన్ లేక వాళ్లెక్కడ ఉపసంహరించుకుంటారో అని క్యాంపులకు తరలిస్తున్నారట. గెలిచిన వాళ్లను రహస్య స్థావరాలకు తీసుకెళ్లడం గురించి విన్నాం. నామినేషన్ వేసిన వారిని దాచిపెట్టడమేమిటి బాబూ?'' అంటూ ట్విట్ చేశారు.
టిడిపికి అభ్యర్థులు దొరకక 5 నుంచి 10 లక్షలు ముట్టచెప్పి నామినేషన్లు వేయించారు. గెలిచే సీన్ లేక వాళ్లెక్కడ ఉపసంహరించుకుంటారో అని క్యాంపులకు తరలిస్తున్నారట. గెలిచిన వాళ్లను రహస్య స్థావరాలకు తీసుకెళ్లడం గురించి విన్నాం. నామినేషన్ వేసిన వారిని దాచిపెట్టడమేమిటి బాబూ? — Vijayasai reddy v (@VSReddy_MP) March 15, 2020