ఛీ వీళ్ళెంత నీచులంటే...డబ్బుల కోసం ఆఖరికి కడుపులో బిడ్డను కూడా వద్దల్లేదా?
బిడ్డను కనిచ్చేందుకు అంగీకరించిన సరోగసీ మదర్ను ఫెర్టిలిటీ సెంటర్ నిర్వాహకులే ఓ ఇంట్లో పేయింగ్ గెస్ట్గా ఆశ్రయం కల్పించారు. ఇక ఆమె సంరక్షణ బాధ్యతలు చూసుకునేందుకు కేర్టేకర్లను నియమించారు. ఆమెకి క్రమం తప్పకుండా ఆహారం, వైద్య పరీక్షలు అన్నీ చేస్తూ ఆమెను జాగ్రత్తగా కంటికి రెప్పలా కాపాడుతున్నారు. ఇక డబ్బుల కోసం బిడ్డను కనిచ్చేందుకు అంగీకరించిందని తెలుసుకున్న కొంత మంది మహిళా ముఠా ఆ మహిళా సంఘాల ముసుగులో సరోగసీ మదర్ని బెదిరించడం మొదలుపెట్టింది. బిడ్డని కడుపులో మోసి ప్రసవించి ఇచ్చినందుకు దంపతులు ఇస్తామన్న డబ్బులో వాళ్ళకి కూడా ఎంతోకొంత వాటా కావాలంటూ డిమాండ్ చేశారు. ఈ విషయమై ఓ సారి తాను ఉంటున్న నివాసానికి వచ్చి బెదిరించి వెళ్లింది. ఇక అందుకు అంగీకరించపోవడంతో ఆమె పై ఈ ఆడ ముఠా కక్షగట్టి గర్భిణి అని కూడా చూడకుండా మూకుమ్మడిగా దాడి చేసింది. అంతేకాక ఆమె కేర్టేకర్లపై కూడా దాడికి పాల్పడ్డారు ముఠా సభ్యులు. దీంతో అనుకోకుండా జరగరానిది జరిగిపోయింది. సరోగసీ మదర్ కడుపులో విచక్షణారహితంగా కొట్టడంతో ఆమె అక్కడే కుప్పకూలింది. తీవ్ర రక్తస్రావం కూడా అవ్వడం మొదలయింది. ఇక వెంటనే ఆమెను కేర్టేకర్లు సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు గర్భస్రావం అయినట్లు నిర్ధారించారు. డబ్బుల కోసం కడుపులో బిడ్డను సైతం వదలని ఆ లేడీ ముఠా పై కేసు పెట్టారు. సదరు పోలీసులు కేసును నమోదు చేసుకుని. ఇంతటి దారుణానికి ఒడిగట్టిన వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. తనపై దాడికి పాల్పడిన నిందితులను బాధితురాలు గుర్తించడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. మహిళా సంఘం ముసుగులో కమిషన్ల కోసం ముఠా సభ్యులు బెదిరింపులకు పాల్పడినట్లు నిర్ధారించారు.