లాక్డౌన్...మోదీ ఇష్టమైనవన్నీ చేస్తున్నారుగా.. ఏంటో తెలుసా...?
కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్రధాని మోదీ సెల్ఫ్ క్వారంటైన్లో ఉంటున్న విషయం తెలిసిందే. అయితే ప్రధానిగా మోదీ తొలిసారి బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి దేశం కోసం నిర్విరామంగా పనిచేస్తూ వస్తున్నారాయన. ఇప్పుడు కరోనా విషయంలో కాస్త టెన్షన్గానే ఉన్నా...పరిస్థితులు కంట్రోల్లోనే ఉన్నట్లు వైద్య, నిఘా వర్గాల నుంచి నివేదికలు అందుతుండటంతో మానసిక ప్రశాంతతను పొందుతున్నారు. ఇదిలా ఉండగా లాక్డౌన్తో అన్ని వ్యవస్థలు స్తంభించడంతో మోదీ కూడా విశ్రాంతి తీసుకుంటున్నారు. అయితే ఈ సమయాన్ని తనకు ఇష్టమైన అభిరుచులకు వెచ్చిస్తున్నారట.
ప్రధాని నరేంద్ర మోదీ కరోనా వైరస్ గురించి మన్ కి బాత్ లో మాట్లాడారు. తాజాగా ఈరోజు ఉదయం ప్రధాని మోదీ సోషల్ మీడియాలో కొన్ని వీడియోలను అప్లోడ్ చేశారు. అలాగే మన్ కి బాత్ సందర్భంగా నా ఫిట్నెస్ దినచర్య గురించి అడిగారు. అందుకే ఈ యోగా వీడియోను షేర్ చేయాలని అనుకున్నాను. మీరు కూడా రోజూ యోగా చేస్తారని ఆశిస్తున్నాను.. అని ఆ ట్వీట్ లో పేర్కొన్నారు. అలాగే తాను ఫిట్నెస్ నిపుణుడనో లేదా వైద్య నిపుణుడినో కాదని ప్రధాని పేర్కొ