బిగ్ బ్రేకింగ్: ఏపీలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు.. టోటల్ కౌంట్ 161
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ చాపకింద నీరులా విస్తరిస్తుంది. ఏపీలో నేడు మరో 12 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. నెల్లూరు జిల్లాలో ఏకంగా 8 కరోనా పాజిటివ్ కేసులు నేడు నమోదు కావడంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. వీరు అందరూ ఢిల్లీ వెళ్లి వచ్చారని అధికారులు గుర్తించారు. కృష్ణా జిల్లాలో 23, గుంటూరు లో 20 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. మొత్తం నెల్లూరు లో 32 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో ఇప్పటి వరకు కరోనా కేసులు ఏపీలో 161కు వెళ్లాయి. 14 కేసులకు ఢిల్లీతో లింకులు ఉన్నాయని అధికారులు గుర్తించారు. అత్యధికంగా విజయవాడ నగరంలో 18 కేసులు నమోదు అయ్యాయి. కడపలో ఒక కేసు.. విశాఖలో మూడు కేసులు నమోదు అయ్యాయి.
కరోనాపై సెల్ఫ్ అసెస్మెంట్ టెస్ట్ :
NIHWN వారి సంజీవన్ మీకు కల్పిస్తోన్న ఈ అవకాశం.. కరోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకోండి.
Google: https://tinyurl.com/NIHWNgoogle
apple : https://tinyurl.com/NIHWNapple