గొడవ పడ్డాడని అతి కిరాతకంగా భర్తను చంపిన భార్య.. చివరికి
జార్ఖండ్కు చెందిన అఖిలేష్ కుమార్(36) చెన్నై లోని రాణిపేట సమీపం లోని బెల్ సంస్థలో అసిస్టెంట్ ఇంజనీర్ గా పనిచేస్తూ భార్య అఖిల కుమారి,కొడుకు తల్లి సావిత్రి దేవి తో కలిసి ఉంటున్నాడు.అయితే వీరిద్దరి మధ్య గత కొద్ది రోజులు గా రోజు గొడవలు పడుతున్నారు.. చిన్న చిన్న వాటికి కూడా ఇద్దరు గొడవలు పడుతున్నారు.. అయితే అది కాస్త చివరికి తారా స్థాయికి చేరింది..
ఇకపోతే శనివారం కుమారుడి కి ఆహారం తినిపించే విషయం దంపతుల మధ్య గొడవ జరిగి తారాస్థాయికి చేరుకుంది. దీంతో కోపోద్రిక్తురాలైన అఖిల కిచెన్ లో నుంచి కత్తి తెచ్చి భర్తను గుండెల్లో పొడిచింది. అతడు కేకలతో స్పందించిన స్థానికులు వెంటనే బెల్ ఆస్పత్రి కి తరలించారు. పరిస్థితి విషమించడంతో అతడిని రాణిపేట లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే ప్రాణాలు కోల్పోయాడు. దీంతో తన కొడుకును చంపింది కొడలేనని మృతుడి తల్లి పోలీసులకు పిర్యాదు చేశారు..రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపడుతున్నారు...