ఫుల్ గా తాగి నడిరోడ్డుపై బైక్ ను తగలబెట్టి హల్ చల్ చేసిన మందు బాబు ...!

Suma Kallamadi

ఇన్ని రోజులు ప్రశాంతంగా ఉన్న భారతదేశంలో మళ్ళీ క్రైమ్ కేసులు ఎక్కువవుతున్నాయి. కరోనా పుణ్యమా అని మందుబాబులు కాస్త అందుకు దూరంగా ఉన్నారని చెప్పవచ్చు. అయితే మే నాలుగో తారీఖు నుంచి కొన్ని రాష్ట్రాల్లో మందు షాపులు తెరవడానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనితో దేశంలో వైన్ షాపులు తెరుచుకున్నాయి. ఇక అంతే మందుబాబులు కరోనా వైరస్ అనే భయం లేకుండా పూర్తిగా సామాజిక దూరం అంటూ ఏమి పాటించకుండా ఒకరిపై ఒకరు పడుకుని రికార్డు స్థాయిలో కొనుగోలు చేశారు. 

 


ఇంతవరకు ఒక ఎత్తు అయితే... మందుబాబులు చేస్తున్న చిత్రవిచిత్రాలు చూడాల్సి వస్తోంది. రెండు రోజుల క్రితం ఒక మందు బాబు తనకు పాము అడ్డు వచ్చింది అని కోపంతో విష సర్పం చూడకుండా నోటితో పాము శరీరాన్ని పీకేశాడు. తలచుకుంటేనే ఒళ్లు భయం కొలిపే అలాంటి దారుణ ఘటన మరవకముందే మరో మందు బాబు ఇంకొక ఈ సంఘటన చేశాడు. నడిరోడ్డుపై ఒక బైకు తగలబెట్టి కలకలం సృష్టించాడు. బెంగళూరు నగరంలో సూర్య నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ సంఘటన జరిగింది. 40 రోజుల తర్వాత మందు తాగిన ఒక యువకుడు అనేకల్ ప్రాంతంలో నడిరోడ్డుపై బైక్ పడేసి దానికి నిప్పు అంటించాడు. అక్కడ ఉన్న ప్రజలు అందరూ చూస్తుండగానే ఆ యువకుడు బైకుకు నిప్పు పెట్టి మంటలను వేడుకగా చూస్తూ ఎంజాయ్ చేశాడు.

 


అక్కడ ఉన్న వాహనదారులు అందరూ ఆశ్చర్యంగా చూస్తున్న తనకు ఏమీ పట్టనట్టుగా ఆ కుర్రాడు నిలిచిపోయాడు. నీకంటే ఆ బైకు మంటల్లో పూర్తిగా ఆహుతి అయిపోయింది. ఈ సంఘటన నేడు సాయంత్రం 4 గంటల ప్రాంతంలో జరిగింది. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: