హైదరాబాద్లో అమానవీయ ఘటన.. మద్యానికి డబ్బులు లేవని కన్న కూతురినే.. ?
మనిషి ఆలోచనలు మామూలుగానే కౄరమృగాన్ని తలపిస్తాయి. అందులో మద్యం తాగిన వారిని ఎప్పుడు నమ్మకూడదు.. అతనితో ఎంత మంచి రిలేషన్ ఉన్నా కూడా ఆ సమయంలో అతనిలో ఎక్కడలేని ఆలోచనలు పుట్టుకొచ్చి ఏం చేస్తాడో, ఎలా ప్రవర్తిస్తాడో తెలియదు.. ఇకపోతే కొందరు తాగితే వారికి బంధాలు, బాంధవ్యాలు ఏవి గుర్తుకు రావు.. బండరాళ్లకంటే కఠినంగా మారిపోతారు.. బాధ్యతలను విస్మరించి ఎంతటి ఘాతుకానికైనా ఒడికడతారు.. ఇకపోతే ఒక వ్యక్తి తాగిన మైకంలో అతని భార్యకు తెలియకుండా కన్నబిడ్దనే కసాయిలా అమ్మేసాడు.. ఇక తాగితే మనిషి నిజాలు మాట్లాడతాడు అంటారు కానీ, ఆ తాగడం కోసం మనిషి మృగంలా తయారవుతున్నాడు. తాజాగా హైదరాబాద్లో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది.