బోండా ఉమా జోరు - హుషారు వెనక ఎవరున్నారు ?

KSK

తెలుగుదేశం పార్టీలో కీలక నాయకుడు మాజీ ఎమ్మెల్యే బోండా ఉమ మంచి దూకుడు మీద ఉన్నారు. అధికార పార్టీని ఇరుకున పెడుతూ ఇటీవల ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పడి ఏడాది అయిన నేపథ్యంలో అమలవుతున్న సంక్షేమ కార్యక్రమాలపై శ్రీకాంత్ రెడ్డి తో తాను చర్చకు రెడీ అని బోండా ఉమా చాలెంజ్ చేశారు. ఈ అంశంలో చంద్రబాబు గానీ మరియు నారా లోకేష్ కానీ కుప్పంలో చర్చకు రావాలని ఇటీవల ప్రభుత్వ చీఫ్ విప్ srikanth REDDY' target='_blank' title='గడికోట శ్రీకాంత్ రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">గడికోట శ్రీకాంత్ రెడ్డి చాలెంజ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి చేసిన ఛాలెంజ్ ఈ విషయంలో బోండా ఉమా స్పందించారు. మీకు కుప్పం అవసరం లేదని ఇక్కడే ఉన్న తాడేపల్లి లో ఏ గల్లీలో అయినా చర్చకు నేను వస్తా నువ్వు రెడీనా అని చాలెంజ్ చేశారు.

 

ఇంకా బోండా ఉమ మాట్లాడుతూ ఒక్క రాజధాని కూడా కట్టలేని ముఖ్యమంత్రి జగన్ భవిష్యత్తులో మూడు రాజధానులు కట్టడం అనేది హాస్యాస్పదం అంటూ సెటైర్లు వేశారు. విశాఖపట్నంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం పెంచడానికి, వైసిపి పార్టీ నాయకులకు లబ్ధి చేకూర్చడానికి రాజధాని అంటూ విశాఖ ప్రజలను రెచ్చగొట్టారు అని జగన్ ప్రభుత్వం పై విమర్శలు చేశారు. అంతేకాకుండా విశాఖపట్టణంలో ట్రస్ట్ భూములను కాజేయడానికి వైసీపీలో కీలక నాయకులు స్కెచ్ వేస్తున్నారని ఆరోపించారు.

 

అధికారంలోకి వచ్చిన జగన్ ఈ ఏడాది పరిపాలనలో రాష్ట్రంలో అరాచకం విధ్వంసం సృష్టించారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తాజాగా బోండా ఉమా ఎప్పుడూ లేని విధంగా ఇంత జోరుగా హుషారుగా వ్యాఖ్యలు చేయడం వెనకాల అధ్యక్షుడు చంద్రబాబు ఉన్నారు అని తన హయాంలో జగన్ హయాంలో జరిగిన అభివృద్ధి చర్చకు వస్తే బయటపెట్టడానికి రెడీగా ఉన్నట్లు ఇందుకోసం శ్రీకాంత్ రెడ్డి వేసిన సవాల్ కి బోండా ఉమా ని బాబు ఎగదోసినట్లు సమాచారం.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: