పోలీస్ అన్నాడు.. బంగారు చైన్ లాక్కెళ్లాడు!

Durga Writes

చైన్ స్నాచర్స్.. వీరి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అడ్రెస్ అని వస్తారు.. మెడలో చైన్ లాక్కెళ్తారు. ఇలాంటి ఘటనలు ఎప్పటికప్పుడు జరుగుతుంటాయి. ఇంకా ఈ లాక్ డౌన్ లో అయితే మరి దారుణం. కొంచం మంచి బంగారం వేసుకుంటే చాలు ఇలా బండిపై నుండి వచ్చి లాక్కెళ్ళుతున్నారు. 

 

 

ఇంకా ఇప్పుడు కూడా అలాంటి ఘటనే ఇప్పుడు చోటుచేసుకుంది. కొంచం నవ్వు వచ్చేలా ఉన్న ఈ ఘటన చాలా ఆశ్చర్యకరంగా ఉంది. ఎవరైనా సరే.. దొంగ కొట్టేస్తే పోలీస్ కు వెళ్లి కంప్లైంట్ ఇస్తారు. కానీ దొంగనే పోలీస్ అంటూ బెదిరిస్తే ఎవరికి చెప్పుకుంటారు? ఇంకా అలాంటి ఘటనే తెలంగాణలోని కామారెడ్డి జిల్లా దేవునిపల్లిలో జరిగింది. 

 

 

పోలీస్‌ను అంటూ వచ్చిన ఓ వ్యక్తి మెదక్ జిల్లా రాజపేటకు చెందిన కుమ్మరి సాయిలు అనే వ్యక్తి జేబులో నుంచి మూడు తులాల బంగారు పుస్తెలతాడు లాక్కొని పారిపోయాడు. దేవులపల్లిలో ఉంటున్న కుమార్తె స్వప్న ఇంటికి సాయిలు వెళ్లే సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే ఈ వింత ఘటన గత నెల 24న జరగ్గా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే బాధితుడు సాయిలు ఇప్పుడు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తును చేస్తున్నారు.                         

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: