బాలికపై నలుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారం..!
దేశంలో నిర్భయ, దిశ కేసుల్లో దుర్మార్గులు కఠిన శిక్ష అనుభవించిన విషయం తెలిసిందే. నిర్భయ నింధుతులను ఉరి తీయగా.. దిశ హత్య కేసులు నలుగురు నింధితులు ఏన్ కౌంటర్ కి గురైన న విషయం తెలిసిందే. అప్పట్లో ఈ వార్తలు సెన్సేషన్ సృష్టించాయి.. ఇలాంటి కామాంధులకు తగిన శాస్తి జరిగిందని అందరూ అన్నారు. కానీ ఇంకా కామాంధులు రెచ్చిపోతూనే ఉన్నాయి. ఆడవారు కనిపిస్తే చాలు పిచ్చి కుక్కల్లా మారి రెచ్చిపోయి వారిపై అత్యాచారాని పాల్పపడుతున్నారు. తాజాగా ఉత్తరప్రదేశ్లో దారుణం జరిగింది. 16 ఏండ్ల బాలికపై నలుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం భదోయ్ జిల్లా ఔరాయ్ ఏరియాలో జూన్ 26న చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.
ఔరాయ్ ఏరియాలోని ఓ గ్రామంలో వివాహ వేడుక నలుగురు వ్యక్తులు హాజరయ్యారు. వారికి ఒంటరిగా కనిపించిన 16 బాలిక తారసపడింది. బాలికకు మాయ మాటలు చెప్పి నిర్జీవ ప్రదేశానికి తీసుకు వెళ్లి బలవంతంగా ఒకరి తర్వాత ఒకరు ఘాతుకానికి పాల్పడ్డారు. కాగా, బాలికకు వైద్య పరీక్షలు చేయించగా అత్యాచారం జరిగినట్లు వైద్యులు ధృవీకరించారని చెప్పారు.
దాంతో నిందితులు నలుగురిపైన ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ (POCSO-పోక్సో) చట్టం కింద జూన్ 30న ఎఫ్ఐఆర్ నమోదైందని పోలీసులు తెలిపారు. దర్యాప్తును వేగవంతం చేస్తామని పోలీసులు చెప్పారు. దేశంలో ఎక్కడ చూసినా ఇలాంటి సంఘనలు పెచ్చు మీరిపోతున్నాయని.. ఇలాంటి కామాంధులు కనిపిస్తే అనుమానం వస్తే వెంటనే దగ్గర ఎవరైనా పెద్ద వారికి చెప్పాలని.. ఎవరినీ నమ్మకూడదని పోలీసులు హెచ్చరిస్తున్నారు.