ఏపీ ప్రభుత్వానికి మరో షాక్? డీలా పడిపోయిన జగన్?
అయితే రామచంద్రమూర్తి తాను వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేస్తున్నట్లు లేఖలో వివరించడం జరిగింది. కారణాలు ఏమైనప్పటికీ ఖాళీగా ఉంటూ జీతాలు తీసుకోవడం ఇష్టంలేకనే రాజీనామా చేసినట్లుగా పలు వార్తలు ప్రచారంలో ఉన్నాయి. జగన్ ప్రభుత్వంలో ఇప్పటికే 33 మంది సలహాదారులున్నారు. ఏదో వారు వైసీపీ కోసం పాటుపడ్డారని వారందరినీ జగన్ ప్రభత్వ సలహాదారు పోస్టుల్లో సర్దుబాటు చేశారనే ప్రచారం ఉంది. ఆయన ప్రస్తుతం జగన్ కొలువులో సలహాదారుగా ఉన్నారు.అయినా ఆయనకు సలహాలు ఇవ్వలేకపోవడం...కొని సలహాలు ఇచ్చినా ఆయన దగ్గరకు పోలేకపోవడంతో తీవ్ర అసంతృప్తికి లోనయిన రామచంద్రమూర్తి జాబ్ సాటిస్ఫాక్షన్ లేకపోవడంతో రాజీనామా చేసారని మరికొందరు అంటున్నారు.
జగన్ సీఎం అయ్యాక ప్రజలకు సంక్షేమ పధకాలు నవరత్నాలు మరియు అధికారులతోపనులు చేయించుకోవడానికి, ఢిల్లీ లో రాజకీయాలు, రాజధాని పై ఎత్తుకు పై ఎత్తులు వేయడం, మీడియావిషయాలు వీటన్నిటికీ సమయం సరిపోయిందని, ఇక ఏ బిజీ లో ఆయన మంత్రులకే టైం ఇవ్వడం లేదు. ఇక పనిలేని ఉత్సవ విగ్రహాలుగా ప్రభుత్వ సలహాదారులను పట్టించుకునే సమయం ఎక్కడిదని అపవాదు లేకపోలేదు. జగన్ తీసుకుంటున్న ప్రతి నిర్ణయంలో గొంతులో నాలుకలాగా అడ్డు పడుతూ వస్తున్న ప్రతి పక్షానికి మరియు సొంత పార్టీలోని కొంతమంది ప్రభుత్వ అసంతృప్తులు ఇది చాలా సంతోషాన్ని కలిగించిందని చెప్పాలి. ఇది ఏపీ ప్రభుత్వానికి ఊహించని ట్విస్ట్ అనే చెప్పాలి. మరి దీనిపై జగన్ ఏ విధంగా స్పందిస్తాడో వేచి చూడాలి.