పబ్ జీ చైనాది కాదా..? ఆ దేశానిదా.. ఏంటీ కన్ఫ్యూషన్..?

praveen
కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న ఒక్కొక్క నిర్ణయం చైనా గుండెల్లో గుబులు పుట్టిస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా భారత ప్రభుత్వం తీసుకుంటున్న ప్రతి నిర్ణయం కూడా చైనా ను  ఆర్థికంగా క్రమక్రమంగా దెబ్బతీస్తోంది. భారత్ చైనా సరిహద్దుల్లో చైనా ఉద్రిక్తతను సృష్టించిన నేపథ్యంలో భారత్ కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. అన్ని రకాలుగా భారత్ నుంచి చైనాను నిషేధించేందుకు నిర్ణయించింది కేంద్ర ప్రభుత్వం. ఈ క్రమంలోనే భారత్ లో  చైనా కు సంబంధించిన అన్ని రకాల వ్యవహారాలను క్రమక్రమంగా నిషేధిస్తూ వస్తుంది. ఈ క్రమంలోనే గతంలో చైనా కు సంబంధించిన టిక్ టాక్ సహా 59 యాప్స్  నిషేధిస్తూ  నిర్ణయం తీసుకుంది  కేంద్ర ప్రభుత్వం.



 దీంతో చైనాకు ఆర్థికంగా ఎంతో నష్టం వాటిల్లిన  విషయం తెలిసిందే. భారత్ లో  అత్యంత ఆదరణ చెందిన  టిక్ టాక్  హలో లాంటి యాప్స్ ను నిషేదించింది. ఇప్పుడు ఎంతగానో ఆదరణ కలిగిన పబ్ జీ   సహా 118 యాప్స్  పై వేటు వేసింది కేంద్ర ప్రభుత్వం. సరిహద్దుల్లో చైనాతో ఉద్రిక్తత నేపథ్యంలో భారత కీలక సమాచారం తస్కరణ కు గురయ్యే అవకాశం ఉందని అందుకే బ్యాన్  చేస్తున్నాము  అంటూ కేంద్ర ప్రభుత్వం తెలిపింది. తాజా నిర్ణయంతో చైనా కు భారీ షాక్ తగిలింది అనే చెప్పాలి. పబ్ జి యాప్ ను నిషేధించిన నేపథ్యంలో పబ్జి వినియోగదారులు అందరూ ప్రస్తుతం సరికొత్త వాదనను తెరమీదకు తెస్తున్నారు.




 పబ్ జీ అసలు  చైనా కు సంబంధించింది కాదని... కొరియా కు సంబంధించింది అంటూ ఒక సరికొత్త వాదనను ప్రస్తుతం తెరమీదికి తెస్తున్నారు. అయితే ప్రస్తుతం ఈ సరికొత్త వాదనపై స్పందిస్తున్న విశ్లేషకులు అందరికీ క్లారిటీ ఇస్తున్నారు... ప్రస్తుతం పబ్ జీ  రెండు దేశాల కంపెనీల కు చెందినదిగా ఉంది అంటూ చెబుతున్నారు. ప్రస్తుతం భారత్ లో  వాడుతున్న మొబైల్ వర్షన్ పబ్ జీ  చైనాకు చెందినది అని... దీనికి  సంబంధించిన సర్వర్లు కూడా పూర్తిగా చైనాలోనే ఉన్నాయని... కానీ కంప్యూటర్ కు  సంబంధించిన పబ్ జీ మాత్రం  కొరియాకు చెందింది అంటూ క్లారిటీ ఇస్తున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: