ఐపీఎల్ ప్రారంభానికి ముందే.. సురేష్ రైనా అద్భుత నిర్ణయం.. హ్యాట్సాఫ్ అంటున్న ఫ్యాన్స్ ఫ్యాన్స్..?

praveen
మరికొన్ని రోజుల్లో ఐపీఎల్ టోర్నీ ప్రారంభం అవుతుందనుకుంటున్న  సందర్భంలో... చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో కీలక ఆటగాడిగా కొనసాగుతున్న సురేష్ రైనా సంచలన నిర్ణయం తీసుకొని ఐపీఎల్ నుంచి నిష్క్రమిస్తున్నట్లు  ప్రకటన చేసిన విషయం తెలిసిందే. దీంతో జట్టు కి భారీ షాక్ తగిలింది. ఎన్నో సీజన్ల  నుంచి సీఎస్కే జట్టులో కొనసాగుతూ  పరిస్థితులకు అనుగుణంగా అద్భుతంగా  ఆడుతూ జట్టులో  బాగా రాణించే సురేష్ రైనా లాంటి నమ్మకం ఉన్న ఆటగాడు దూరం కావడంతో జట్టు యాజమాన్యం అయోమయంలో పడిపోయింది. అయితే కరోనా  వైరస్ కు భయపడి సురేష్ రైనా జట్టు నుంచి తప్పుకున్నాడు అని ఎన్నో వార్తలు కూడా హల్చల్ చేయగా... తాను  తప్పుకోవడానికి గల కారణం ఏమిటి అనేదానిపై సురేష్ రైనా స్పందించారు.



 తన మేనత్త కుటుంబం పై దుండగులు దాడి చేసి తన మామయ్యను  హత్య చేయడం కారణంగా ఐపీఎల్ నుంచి తప్పుకున్నాను అంటూ తెలిపారు సురేష్ రైనా. అయినప్పటికీ సీఎస్కే జట్టులో సురేష్ రైనా లేకపోవడాన్ని మాత్రం ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. ఇలాంటి క్రమంలో ఐపీఎల్ టోర్నీ ప్రారంభానికి ఒక రోజు ముందు సురేష్ రైనా అద్భుతం నిర్ణయం తీసుకుని ఫ్యాన్స్ అందరూ గర్వపడేలా చేశాడు. ఫ్యాన్స్ అందరిలో  సరికొత్త ఉత్సాహాన్ని నింపాడు. జమ్మూకాశ్మీర్లో అప్ కమింగ్  క్రికెటర్లకు సహాయం చేయడానికి ముందుకొచ్చాడు సురేష్ రైనా.



 ఈ మేరకు అక్కడి అధికారులతో సమావేశమై పలు ప్రణాళికలను కూడా వివరించాడు. ఇక ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా అభిమానులతో పంచుకున్నాడు సురేష్ రైనా. జమ్ము కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ను  కలిసిన సరైన... కశ్మీర్లో క్రీడలను మరింతగా ప్రోత్సహించి ఎంతో మంది క్రీడాకారుల లోని ప్రతిభను వెలికి తీసే విషయంపై కీలకంగా చర్చించాడు. అయితే క్రీడాకారులను ప్రతిభను వెలికితీసేందుకు నిర్ణయించుకున్న సురేష్ రైనా..  దీనికోసం అద్భుతమైన నిర్ణయం తీసుకుని... కాశ్మీర్లో కి వెళ్లి మరీ చర్చలు జరగడం అభిమానులందరినీ మరింత గర్వపడేలా చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: