'బిగ్ బాస్' మిమ్మల్ని చూస్తున్నాడు.. జరిమానా తప్పదు..?
ఇక ఇప్పుడు మరో సారి వినూత్నంగా వాహనదారులు అందరిని ఆలోచనలో పడేసారు తెలంగాణ ట్రాఫిక్ పోలీసులు. ప్రస్తుతం మా టీవీలో ప్రసారమయ్యే బిగ్ బాస్ ఎంత పాపులారిటీ సంపాదించినదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రస్తుతం బుల్లితెర పై టాప్ రేటింగ్ ఉన్న షో గా దూసుకుపోతుంది బిగ్ బాస్. అయితే ప్రస్తుతం బిగ్ బాస్ ని ఉదాహరణగా చూపిస్తూ ప్రస్తుతం వాహనదారులను అలర్ట్ చేస్తున్నారు ట్రాఫిక్ పోలీసులు. ఇటీవలే దుర్గం చెరువు పర్యాటక శోభను సంతరించుకున్న విషయం తెలిసిందే. ఎంతో మంది పర్యాటకులు దుర్గం చెరువు వీక్షించేందుకు వస్తున్నారు.
అదే సమయంలో కొంతమంది వాహన దారులు ట్రాఫిక్ నిబంధనలు మరిచి రోడ్డుపైనే వాహనాలు ఆపి ఏకంగా ఫోటోలు దిగడం లాంటివి కూడా చేస్తున్నారు. ఇలాంటి వారిని హెచ్చరించేందుకు.... దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి పై ఎవరైనా నిబంధనలు ఉల్లంఘించి వాహనాలు ఆపి ఫోటోలు తీయడం లాంటివి చేస్తే సీసీ కెమెరాలో రికార్డు అవుతుందని.. జరిమానాలు పడతాయని... బిగ్ బాస్ మిమ్మల్ని ఎప్పుడూ చూస్తూనే ఉన్నాడు అంటూ ట్రాఫిక్ పోలీసులు హెచ్చరించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టగా అది కాస్త వైరల్ గా మారిపోయింది..