దుబ్బాక ఉపఎన్నికలలో గెలుపుపై కేసీఆర్ ధీమా

VAMSI
ఎన్నికల సమయం అంటే ఎన్నో వ్యూహాలు మరెన్నో తేల్చాల్సిన లెక్కలు.... వీటన్నిటితో సతమతమవుతూ ఎన్నికల కోసం సంసిద్ధత అవ్వడానికి అన్ని రకాల వివరాల సేకరణ చేస్తూ బిజీ బిజీగా ఉంటారు మన నేతలు. వీటి కంటూ పక్కా ప్రణాళిక కోసం ఎన్నికలకు కాస్త ముందు ప్రజల మైండ్ సెట్ ఏ రీతిలో ఉంది? అన్న విషయంపై సర్వేలు నిర్వహించే తీరు తెలిసిందే. కొన్ని దశాబ్దాల క్రితం నిఘా వర్గాలు ఇచ్చిన రిపోర్టును ప్రభుత్వం విశ్వసించేది. అయితే మారుతున్న రోజుల్లో చోటు చేసుకుంటున్న మార్పుల కారణంగా.. నిఘా రిపోర్టును ఒకవైపు పరిగణలోకి తీసుకుంటుంది. మరోవైపు తాము సొంతంగా వివిధ ప్రైవేటు ఏజెన్సీల ద్వారా సర్వేలు నిర్వహించటం  పెరిగింది. మూడు, నాలుగు పైనే సర్వేలు నిర్వహించటం.. వారిచ్చే రిపోర్టుల్లోని కామన్ అంశాలు ఏమున్నాయి? ఏ అంశం ఎక్కువగా  ఉంటోంది ...ఎవరి అబ్జర్వేషన్ ఏమిటి? అన్న వివరాల్ని రివ్యూ చేసుకొని ఒక నిర్ణయానికి రావటం ఈ మధ్యన ఎక్కువగా కనిపిస్తోంది. ఈ విషయాల్లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దూరదృష్టితో ఆలోచిస్తూ... పనులు చకచకా చేస్తారని కామన్ టాక్.

తాజాగా జరిగిన మంత్రివర్గ సమావేశంలో త్వరలో జరిగే దుబ్బాక ఉప ఎన్నికకు సంబంధించి విషయాలను మరియు తాను చేయించిన సర్వేలకు సంబంధించిన అంశాలు గురించి  సీఎం కేసీఆర్ ప్రస్తావించినట్లు తెలుస్తోంది. దుబ్బాక ఉప ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి సోలిపేట సుజాత మంచి మెజార్టీతో గెలవనున్నట్లుగా చెప్పుకొచ్చారు. తాముచేయించిన తాజా సర్వేల్లో 74 శాతం మంది టీఆర్ఎస్ కు అనుకూలంగా ఉన్నట్లుగా సమాచారం. ఇదే కనుక కొనసాగితే టిఆర్ఎస్ మరింత పట్టు సాధించి ఎన్నికల్లో నెగ్గుకు రావడం ఖాయం.

దుబ్బాక ఉప ఎన్నికలోనే కాదు.. గ్రేటర్ ఎన్నికల్లోనూ వందకు పైగా స్థానాల్ని సొంతం చేసుకోనున్నట్లు ఆశాభావం వ్యక్తం చేసిన కేసీఆర్ త్వరలో జరిగే పట్టభద్రుల స్థానాలకు జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ అభ్యర్థులు గెలవనున్నట్లు పేర్కొన్నారు. విపక్షాలు మాటకొస్తే టిఆర్ఎస్ ను ఢీ కొట్టడం కష్టమే అని చెప్పుకొచ్చారు.
సీఎం కేసీఆర్ మాటల శైలిని చూస్తుంటే తెలంగాణలో తమను ఢీకొట్టే విపక్ష పార్టీ లేదన్న... ధీమాను వ్యక్తం చేస్తున్నట్లు అర్థమవుతోంది.. కేసీఆర్ సర్వే రిపోర్టులకు తగ్గట్లే.. ఎన్నికల ఫలితాలు ఏ రకమైన సమాధానం ఇవ్వనున్నాయో వేచి చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: