పవన్ సంచలన విమర్శలతో ఇరుకునపడ్డ వీర్రాజు ?

కొద్ది రోజుల క్రితం వైసీపీ అధినేత జగన్ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన జగనన్న విద్యా కానుక పథకంపై దేశ వ్యాప్తంగా ఆయన ప్రశంసలు దక్కాయి. రాష్ట్రంలోనూ పార్టీలకు అతీతంగా జగన్ ప్రవేశపెట్టిన పథకంపై ఆంతా అభినందించారు. పాఠశాల విద్యార్థులు, వారి తల్లిదండ్రుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అమ్మ ఒడి పథకం కింద పదిహేను వేల రూపాయలు విద్యార్థి తల్లి బ్యాంకు అకౌంట్లో జమ చేస్తున్న ఏపీ ప్రభుత్వం మళ్ళీ జగనన్న విద్యా కానుక పేరుతో మూడు జతలు బట్టలు, ఒక జత బెల్టు, సాక్షులు, స్కూల్ బ్యాగ్ వంటివి పంపిణీ చేసింది. అంతేకాక పాఠశాలలను కార్పొరేట్ పాఠశాల స్థాయికి తీర్చిదిద్దింది. ఈ పథకాన్ని ఏపీ ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంది. ప్రతి స్కూల్లోనూ ఒక పండుగ మాదిరిగా ఈ కార్యక్రమం జరిగింది.


 ఇదిలా ఉంటే ఈ విద్యా కానుక పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన సంగతి తెల్సిందే. ఇది జగనన్న విద్యా కానుక అనే కంటే, దాన్ని మోదీ, జగన్ అన్న  విద్యా కానుక అని పెట్టి ఉంటే బాగుండేదేమో అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడం బాగా వైరల్ అయింది. ఈ పథకం కోసం కేంద్రం 60 శాతం నిధులు ఇస్తుంటే, రాష్ట్ర ప్రభుత్వం కేవలం 40 శాతం మాత్రమే ఇస్తోందని చెప్పుకొచ్చారు. ఇక పవన్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టగానే, జనసైనికులు దాన్ని బాగా వైరల్ చేసి వైసీపీ ప్రభుత్వాన్ని మరింతగా అల్లరి చేశారు. ఈ రకంగా జనసేన కు మంచి క్రెడిట్ వచ్చినా, పవన్ ఈ రకంగా వ్యవహరించడంపై ఇప్పుడు ఏపీ బిజెపి అధ్యక్షుడు సోము వీర్రాజు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు తెలుస్తోంది.


అసలు పవన్ కంటే ముందుగానే సోము వీర్రాజు ఈ వ్యవహారం పై వైసీపీ ప్రభుత్వాన్ని నిలదీసి ఉంటే పరిస్థితి వేరే రకంగా ఉండేది. కానీ ఆయన అలా చేయకుండా, నేరుగా ఈ వ్యవహారంపై జనసేన స్పందించడం తో ఇప్పుడు బీజేపీ తీవ్ర ఇబ్బంది పడుతోంది. అయితే ప్రస్తుతం బిజెపి వైసిపి ల మధ్య పొత్తు ఏర్పడే అవకాశం ఉండడంతో, ఏపీ బీజేపీ నేతలే ఈ విధంగా విమర్శలు చేయించారా అనే అనుమానాలు ఇప్పుడు వ్యక్తం అవుతున్నాయి. ఏమో బీజేపీ రాజకీయం ఈ విధంగా కూడా ఉండవచ్చని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: