యూపీలో వినూత్న అధ్యాయం... యోగి ఆయుర్వేద రోడ్లు..?
స్వయంగా ముఖ్యమంత్రి ప్రజల వద్దకు వెళ్లి వినతి పత్రాలు స్వీకరించడం... ఇక రాష్ట్ర అభివృద్ధి పరంగా జపాన్ సంస్థల ను ఆకర్షించటం.. అంతే కాకుండా రాష్ట్రం లో ఉన్న అక్రమాల ను అరికట్టడం లో యోగి ఆదిత్యనాథ్ సర్కార్ కి సాటి లేరు అని చెప్పాలి. ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ మరోసారి గొప్ప పని దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించారు. ఆయుర్వేదిక రోడ్లను ప్రారంభించేందుకు యోగి ఆదిత్యనాథ్ ముందడుగు వేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఏకంగా రాష్ట్రంలో 175 రహదారులు ఆయుర్వేదిక్ రహదారిలుగా మార్చింది యోగి సర్కార్.
ఆయుర్వేదిక్ రహదారులు అంటే... దాదాపు 175 రహదారులను ఆయుర్వేదిక్ రోడ్ల కింద తయారుచేసిన యోగి సర్కార్... ఇక ఆ రహదారిల పక్కన ఏకంగా 35 వేల ఆయుర్వేదిక్ ప్లాంట్లను ఏర్పాటు చేశారు. 30 రకాల ఆయుర్వేదానికి సంబంధించినటువంటి మొక్కలను ఏర్పాటు చేశారు. ఇందులో ఎన్నో రకాల మేలు చేకూర్చే ఆయుర్వేదిక మొక్కలు ఉన్నాయి. ఇక రహదారులపై వెళుతున్న సమయంలో ఈ ఆయుర్వేదిక మొక్కల ద్వారా స్వచ్ఛమైన గాలి తో... ఎంతోమందికి రోగనిరోధక శక్తి పెరిగి అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు. సీఎం యోగి ఆలోచనకు హ్యాట్సాఫ్ చెబుతున్నారు.