సీఎం లు మారిన రాష్ట్రంలో రైతులకు కష్టాలు తీరలేదు?
వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో రైతులకు రుణాలు మంజూరు చేశారు.అంతేకాదు పాద యాత్ర చేసి రైతుల కష్టాలను తెలుసుకొని వాటికి ఎక్కడ పరిష్కారం దొరుకుతుందో ఆ కోణంలో అన్నీ రకాల చర్యలను చేపట్టి ప్రజలను అనే విధాలుగా ఆదుకున్నారు.రైతు చావులు అనే మాట వినపడలేదు..ఆ మరణానంతరం రైతుల ఆవేదనను పట్టించుకొనే నాథుడు లేకపోవడంతో ఎందరో ఆత్మ హత్య చేసుకొని ప్రాణాలను కోల్పోయారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల సమస్యలను ఎన్ని సార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా కూడా నామ మాత్రం గానే పనులు జరిగాయి.
ఇది ఇలా ఉండగా ప్రస్తుత పరిస్థితులను పరిగణలోకి తీసుకుంటే.. గత టీడీపీ ప్రభుత్వం లో ప్రజలు అనా వృష్టితో అల్లాడిపోయింది. ఎక్కడ చూసినా కరువు ఉండటంతో రైతులు పంటలు వేసుకోవడానికి నీళ్లు లేక చాలా ఇబ్బందులను ఎదుర్కొన్నారు. చాలా మంది ప్రాణాలను విడిచారు.ఇప్పుడు వైసీపీ జగన్ పాలనలో కూడా రైతులకు లాభాల కన్నా కూడా నష్టాలే ఎక్కువగా చవి చూసాయి.అతి వృష్టి ఎక్కువగా ఉంది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎప్పుడు భారీ వర్షాలు కురవడంతో వేసిన పంటలు నీటమునిగాయి. దాంతో చేతికొచ్చిన పంట నీట మునగడం ప్రజలు లబో దిబో మన్నారు.ఎలా చూసుకున్నా కూడా రాష్ట్రానికి కొత్త సీఎం లు కొత్త ప్రభుత్వాలు వచ్చాయి గానీ , రైతులకు , ప్రజలకు ఎక్కడ లాభాలు రాలేదని కొందరు రాజకీయ ప్రముఖులు స్పష్టం చేశారు..