వరద బాధితులకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేయనున్న జగన్ ప్రభుత్వం...
ఈ మేరకు కృష్ణా, గుంటూరు, పశ్చిమ, తూర్పు గోదావరి జిల్లాల కలెక్టర్లకు ప్రభుత్వం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. వరదల్లో చిక్కుకుని ఇబ్బందులు పడుతున్న ఒక్కో కుటుంబానికి 25 కేజీల బియ్యం, కేజీ కందిపప్పు, లీటర్ పామాయిల్, కేజీ ఉల్లిపాయలు, కేజీ బంగాళాదుంపలు ఇవ్వాలని ఆదేశించింది.ఇక వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలో భారీగా వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. ఎడతెరపి లేకుండా కురిసిన వర్షాలకు అనేక ప్రాంతాలు నీటి మునగడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వరదల్లో చిక్కుకుని తినేందుకు తిండి లేక అనేక మంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ తరుణంలో వారిని ఆదుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది.