దేశీ స్టాక్ మార్కెట్స్ లాభాలకి చెక్.. నేడు నష్టాల్లో ముగిసిన మార్కెట్స్..!
ఇక నేడు నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 50 లో లాభనష్టాల విషయానికి వస్తే.. ముందుగా అత్యధికంగా లాభపడిన వాటిలో ఎన్టిపిసి, భారతీ ఎయిర్టెల్, బజాజ్ ఫైనాన్స్, టాటా మోటార్స్, ఐఓసి కంపెనీ షేర్లు అత్యధికంగా లాభపడ్డాయి. ఇందులో అత్యధికంగా ఎన్టిపిసి 2.86 శాతం లాభపడింది. ఇక మరోవైపు అత్యధికంగా నష్టపోయిన షేర్ల విషయానికి వస్తే ఇండస్ లాండ్ బ్యాంక్, హీరో మోటార్ కార్ప్, ఐసిఐసిఐ బ్యాంక్, ఇన్ఫోసిస్, సిప్లా అత్యధికంగా నష్టపోయిన వాటిలో ముందుగా ఉన్నాయి. ఇందులో అత్యధికంగా ఇండస్ లాండ్ బ్యాంక్ 3.08 శాతం నష్టపోయింది.
ఇక నేడు హైదరాబాద్ మహానగరంలో బంగారం ధరల విషయానికొస్తే.. స్వచ్ఛమైన 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 160 రూపాయలు పెరిగి రూ. 51,490 వద్ద ముగిసింది. అలాగే 22 క్యారెట్ల పసిడి 10 గ్రాములకు 150 రూపాయలు పెరిగి 47, 200 రూపాయల వద్ద ముగిసింది. ఇక బంగారం పెరిగితే వెండి మాత్రం కాస్త డీలా పడింది. హైదరాబాద్ మార్కెట్ లో కేజీ వెండి ధర 500 రూపాయలు తగ్గి 63 వేల రూపాయలకు చేరుకుంది.