దసరా పై ఉన్న కధల్లో ఇదే నిజమైనదా...?
ఇది ఇలా ఉండగా అమ్మవారిని ఎందుకు పూజిస్తాం అంటే...? బ్రహ్మదేవుని వరంతో మహిషాసురుడు చెలరేగిపోయాడు. దేవలోకంపై దండయాత్ర చేసి ఇంద్రుడిని ఓడించాడు. మహిషాసురుడి పై త్రిముర్తుల్లో క్రోదాగ్ని రగిలింది. ఆ తేజస్సు ఓ స్త్రీరూపమై జన్మించింది. అప్పుడు గళమూర్తిగా అవతరించిన ఆమె 18 బాహువులను కలిగి ఉంది. ఆమెకు శివుడు శూలమును విష్ణువు చక్రమును ఇంద్రుడు వజ్రాయుధమును వరుణ దేవుడు పాశము బ్రహ్మ దేవుడు అక్షమాల కమండలము హిమవంతుడు సింహమును వాహనంగాను ఇచ్చారు. మహిషాసురునితో తలపడింది ఆమె. ఈ యుద్ధంలో ఆ దేవి వాహనమైన సింహమూ శత్రువులను చీల్చి చెండాడింది. దేవితో తలపడిన అసురుడు మహిషిరూపము సింహరూపము మానవరూపముతో భీకరముగా పోరి చివరకు తిరిగి మహిషిరూపములో దేవి చేతిలో హతుడైనాడు.
ఇందు మేరకు మనం అమ్మ వారిని ఈ నవరాత్రులు పూజిస్తాము అని అంటారు. నవరాత్రుల్లో ఒక్కో రోజు ఒక్కో అవతారంలో అమ్మవారు మనకు దర్శనమిస్తారు. అమ్మవారిని నిష్టగా పూజిస్తాం. ఇక ఎనిమిదో రోజున దుర్గాష్టమిని కూడా ఘనంగా జరుపుతారు. అలానే రామాయణం ప్రకారం శ్రీ రాముడు రావణుడిపై విజయం సాధించిన రోజును గర్తు చేసుకుంటూ కూడా కొన్ని ప్రాంతాల్లో విజయదశమి నిర్వహించుకుంటారు. ఇలా చెడు పై మంచి విజయం సాధించినందున ఈ పండుగ చేసుకోవడం తరతరాల నుండి మనం చూస్తున్నాం.