ప్రస్తుతం ఉల్లి ధరలు కొండెక్కి కూర్చున్న విషయం తెలిసిందే. ఉల్లి దిగుబడి తగ్గిపోవడంతో ఉల్లి ఒక్కసారిగా డిమాండ్ ఏర్పడింది. దీంతో భారీగా ధరలు పెరిగిపోయాయి. మరోసారి సామాన్య ప్రజలకు ఉల్లి భారంగా మారింది. దీంతో సామాన్య ప్రజలకు ఉల్లి కోయకుండానే కన్నీళ్లు వచ్చే పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే కరోనా వైరస్ ప్రభావం దృశ్య కూరగాయల ధరలు పెరిగి సామాన్య ప్రజలందరూ బెంబేలెత్తి పోతుంటే.. ఉల్లి ధరలు కూడా ఆకాశాన్ని అంటుతున్న తరుణంలో ప్రజలు మరింత తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అన్న విషయం తెలిసిందే.
దాదాపు ఉల్లి కిలో ధర వంద రూపాయలకు పైగానే పలుకుతున్న నేపథ్యంలో సామాన్య ప్రజలందరూ ఉల్లి కొనుగోలు చేయాలంటేనే వణుకుతున్నారు. గతంలో లాగానే ఉల్లి ధరలు భారీగా పెరిగిపోవడంతో అటు వైపు చూడకుండా మళ్ళి ఉల్లి లేకుండానే వంటలు వండుకునే పరిస్థితులు మళ్ళీ వచ్చేశాయి. ఇక దేశంలో ఉల్లి కొరత భారీగా ఏర్పడి ప్రస్తుతం భారీగా డిమాండ్ ఏర్పడి కూడా భారీగా ధర పలుకుతున్న నేపథ్యంలో అటు
{{RelevantDataTitle}}