టీడీపీ చేసిన ఈ అతిపెద్ద పొరపాటే వారి కొంప ముంచిందా..?
ఇక అధికారంలోకి రాగానే అధికారం అంటే ఇది అని చెప్పే విధంగా అయన పరిపాలన కొనసాగిస్తున్నారు.. జగన్ ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికి 17 నెలలు పూర్తయ్యింది. అంటే ఏడాదిలో రెండున్నరేళ్లు పూర్తవుతాయన్నమాట..ఈ క్రమంలో జగన్ మొదట్లో చెప్పిన ప్రతి మాటకు నిలబడి ఉంటున్నారు.. ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ ప్రజలకు ఏ లోటు రాకుండా చుస్తునారు.. ఇక టీడీపీ విషయానికొస్తే టీడీపీ పార్టీ తమ ఓటమి కి కారణాలు ఇంటిని వెతుకులాట కొనసాగిస్తోంది..
వారి ఓటమికి ముఖ్య కారణం బీసీ వర్గాన్ని, తమకు అండగా ఉన్న ఇతర సామజిక వర్గాలను పట్టించుకోకపోవడమే అని టీడీపీ కి అర్థమైపోయింది.. అధికారంలో ఉండగా అండగా ఉన్నవారిని ఏ మాత్రం పట్టించుకోకుండా, ఆ అధికారం పోయాక ‘నేను మారాను’ మిమ్మల్ని ఏదో చేసేస్తాను అని చెప్పే విషయంలో టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడికి ఒక ప్రత్యేక రికార్డే ఉందని చెబుతుంటారు ఆయన సొంత పార్టీ నాయకులు. ఆ విధంగానే చంద్రబాబు అధికారంలోకి రాగానే టీడీపీ కి సపోర్ట్ గా ఉన్న సామజిక వర్గాలను పట్టించుకోలేదు.. దాంతో ప్రజలు తగిన బుద్ధి చెప్పారు.. ఏది ఏమైనా అధికారంలో ఉన్నప్పుడు వెనుకబడిన సామాజికవర్గాలకు రాజకీయంగా ప్రాధాన్యం కల్పించకపోవడం తాము చేసిన అనేక పొరపాట్లలో ప్రాధాన్యమైనదిగానే టీడీపీ నేతలు ఇప్పుడు గుర్తిస్తున్నారంటున్నారు.