లక్ష ఓట్ల మెజారిటీ లక్ష్యంగా దుబ్బాక లో కేసీఆర్ కొత్త ఎత్తుగడ..?
అధికార పార్టీ పూర్తి గా హరీష్ రావు ని ఎప్పటినుంచొ ఇక్కడే ఉంచి పార్టీ గెలుపుకోసం కృషి చేయిస్తుంది.. అయన తన సొంత నియోజకవర్గంలా ఇక్కడ పార్టీ కోసం పనిచేస్తున్నారు.. కేసీఆర్ ఎమ్మెల్సీ ఎన్నికలపై శ్రద్ధ వహించగా, కేటీఆర్ గ్రేటర్ పై దృష్టి సారించారు.. దాంతో హరీష్ రావు కి దుబ్బాక ని ఇచ్చారు.. ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో పార్టీ గెలుపు ఢంకా మోగించాలని కేసీఆర్ ఆదేశాలిచ్చారట.. అయితే హరీష్ రావు కి ఇక్కడి బాధ్యతలు ఇచ్చినప్పటికీ కేసీఆర్ ఇక్కడ ప్రచారం చేయడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది..
లక్ష మెజార్టీని లక్ష్యంగా పెట్టుకున్నానని హరీష్ రావు చెబుతున్నారు. ఆ దిశగా ఆయన తనదైన శైలిలో వ్యూహం రచిస్తున్నారు. ఆ వ్యూహంలో భాగంగానే కేసీఆర్ ని ఇక్కడ ప్రచారం చేయిస్తున్నారని అంటున్నారు.. గతంలో కేసీఆర్ సిద్ధిపేట ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆ నియోజకవర్గంలోని 11 గ్రామాలు ఇప్పుడు దుబ్బాకలో ఉన్నాయి. ఇప్పుడు సీఎం ప్రాతినిథ్యం వహిస్తున్న గజ్వేల్ సైతం దుబ్బాక పక్కనే ఉంటుంది. గడువు ముగిసే చివరి రోజుల్లో కేసీఆర్తో బహిరంగసభ పెట్టించాలనే ఆలోచన చేస్తున్నారు. కేసీఆర్ కూడా ప్రచారం చివరికి వచ్చేటప్పుడు నిర్ణయం తీసుకుందామని చెప్పినట్లుగా తెలుస్తోంది.