అతివేగం రోడ్డు నిబంధనలు పాటించకపోవడం వెరసి రోజురోజుకు రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతున్నాయి అన్న విషయం తెలిసిందే. ఇక ఈ మధ్య కాలంలో రోడ్డు ప్రమాదాల కారణంగా ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు కూడా తెరమీదకు వస్తున్నాయి. తూర్పు గోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెళ్లికి వెళ్లి వస్తున్న తరుణంలో ఏకంగా రోడ్డు ప్రమాదం కారణంగా ఆరుగురు ప్రాణాలు కోల్పోయిన ఘటన స్థానికంగా ఒక్కసారిగా కలకలం సృష్టించింది. గోకవరం మండలం తంటికొండ కల్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం దగ్గర పెళ్లి బృందం ప్రయాణిస్తున్న వ్యాన్ అదుపు