కేసీఆర్ కోసం పూజలు చేస్తాను, ఆయన బాగుండాలి: బండి సంజయ్

Gullapally Rajesh
తెలంగాణాలో ఇప్పుడు భారతీయ జనతా పార్టీ బలపడాలి అని భావిస్తున్న సంగతి తెలిసిందే. రాజకీయంగా ఇప్పుడు అన్ని విధాలుగా కూడా భారతీయ జనతా పార్టీ సిఎం కేసీఆర్ ని టార్గెట్ చేస్తున్న సంగతి తెలిసిందే. అనేక ఇబ్బందులు  ఇప్పుడు తెలంగాణా సిఎం కేసీఆర్ ని పెట్టడానికి రెడీ అవుతుంది బిజెపి. ముఖ్యంగా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. తాజాగా ఆయన మరోసారి విమర్శలు చేసారు. జోగులాంబ గద్వాల జిల్లా అల్లంపూర్ లోని 5వ శక్తి పీఠం శ్రీ జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయాలను దర్శించుకున్న తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేసారు .
తుంగభద్ర పుష్కరాల గురించి తెలంగాణ ముఖ్యమంత్రి పట్టించుకోవడం లేదు అని ఆయన విమర్శలు చేసారు. 5వ శక్తి పీఠం పై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ముఖ్యమంత్రి... నేనే అసలైన హిందువును అంటు.. ఆలయాల అభివృద్ధి ని పట్టించుకోవడం లేదు అని ఆయన మండిపడ్డారు. ఏ దేవాలయం కు వెళ్లిన వేల కోట్లు, 100 కోట్లు అంటాడు కానీ ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టడు అని ఆయన విమర్శించారు. సోయి లేకుండా ఫామ్ హౌస్ లో , సోయి లేకుండా ప్రగతి భవనం లో ఉంటే పనులు జరగవు అని ఆయన విమర్శించారు.
తెలంగాణ ముఖ్యమంత్రి వేయి కోట్లకు వంద కోట్లకు తేడా లేకుండా పోయింది అని ఆగ్రహం వ్యక్తం చేసారు. మంత్రులకు అపాయింట్ మెంట్ ఇవని రాష్ట్ర ముఖ్యమంత్రి అని ఆయన విమర్శలు చేసారు. రాష్టాన్ని, పేద ప్రజలను పట్టించుకోరు అని మండిపడ్డారు. కనీసం.. నా అన్నవారిని పట్టించుకుంటే మీరు మీ కుటుంబం మీ పిల్లలు అష్ట ఐశ్వర్య లతో ఉండాలని మేమె అమ్మవారిని కోరుకుంటాము అని బండి సంజయ్ విమర్శించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: