భారత్ నుంచి డ్రాగన్ కు కోలుకోలేని దెబ్బ !
అయితే కరోనా వైరస్ వ్యాప్తి, తూర్పు లదాఖ్ సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో చైనా ఉత్పత్తులను బహిష్కరించాలంటూ అంబానీ, టాటా, అజీం ప్రేమ్జీ, మిట్టల్ తదితర దేశీయ పారిశ్రామిక దిగ్గజాలకు సీఏఐటీ గతంలో లేఖ రాసింది. భారత సైనికులను పొట్టనబెట్టుకున్న డ్రాగన్ ఆర్మీ దురాగతాలను నిరసిస్తూ బ్యాన్ చైనా అంటూ ప్రకటన కూడా విడుదల చేసింది.
మరోపక్క దేశంలోని 20 ప్రధాన వాణిజ్య పట్టణాల నుంచి అందిన వివరాలు ప్రకారం స్థానిక మార్కెట్లలో సుమారు రూ. 72 వేల కోట్ల టర్నోవర్ జరిగింది. ఫలితంగా చైనా మార్కెట్ కు రూ.40 వేల కోట్ల నష్టం వాటిల్లింది.
ఈ ఏడాది జూన్ లో గల్వాన్ లోయలో చైనా సైనికుల దురాగతానికి 20 మంది భారత జవాన్లు అమరులయ్యారు. వాస్తవాధీన రేఖ యథాతథ స్థితిని మార్చేందుకు ప్రయత్నించిన డ్రాగన్ ఆర్మీని అడ్డుకునే క్రమంలో కల్నల్ సంతోష్ బాబు వీర మరణం పొందారు. ఈ నేపథ్యంలో చైనా వస్తువులను నిషేధించాలంటూ పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి. అదే సమయంలో టిక్టాక్, వీచాట్ తో పాటు అనేక చైనీస్ యాప్లను ప్రభుత్వం నిషేధించింది. ఇప్పుడు దీపావళి కొనుగోళ్లపైనా ఇది ప్రభావం చూపింది.