దారుణం : అత్యాచారం, హత్య.. తర్వాత గుండెను కోసి తినేశారు..?

praveen
నేటి సమాజంలో రోజురోజుకు మనిషి అన్న వాడే కరువై పోతున్నాడు. రోజురోజుకు దారుణంగా ప్రవర్తిస్తూ మృగాలుగా మారిపోతున్న మనుషులే ఎక్కువై పోతున్న ఘటనలు చూస్తుంటే ఇది ముమ్మాటికి నిజం అనే భావన కలుగుతుంది. రోజురోజుకు మనుషుల్లో వస్తున్న మార్పు సభ్య సమాజాన్ని తలదించుకునేలా చేస్తుంది. ఆడ పిల్లలపై జరుగుతున్న అత్యాచార ఘటనలు... మహిళలు అందరూ కూడా ప్రశ్నార్ధక జీవితాన్ని గడిపేలా చేస్తున్నాయి. మొన్నటి వరకు కేవలం మానవత్వం మరిచిన మనుషులు ఆడపిల్లలపై అత్యాచారం చేసేవారు, ప్రస్తుత రోజుల్లో మాత్రం అత్యాచారం చేయడంతో పాటు దారుణంగా హతమార్చిన ఘటన లు కూడా ఎన్నో తెరమీదకు వస్తున్నాయి.



 ఆడపిల్ల పై అత్యాచారం చేస్తే.. ప్రాణాలు తీసేస్తే శిక్ష పడుతుంది అన్న భయం కూడా ఎవరి లో కనిపించడం లేదు. రోజు రోజుకు తెర  మీదకి వస్తున్న ఘటనలు అందరినీ ఒక్కసారిగా ఉలిక్కిపాటుకు  గురిచేస్తున్నాయి. మహిళలు అందరూ కామాంధుల బారిన పడకుండా ఉండేందుకు ఎన్నో  ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కూడా రోజు రోజుకు తెర  మీదకి వస్తున్న ఘటనలు మాత్రం మహిళలకు రక్షణ లేదు అనే విషయాన్ని ప్రతి క్షణం గుర్తు చేస్తూనే ఉన్నాయి. ఇక్కడ ఇలాంటి దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది... ఓ యువతిపై దారుణంగా అత్యాచారానికి పాల్పడి అనంతరం హత్య చేశారు.



 అక్కడితో ఆగకుండా మానవ మృగాలు గా మారిపోయిన సదరు మనుషులు ఏకంగా సదరు యువతి గుండెను శరీరం నుంచి వేరు చేసి తిన్న దారుణ ఘటన ఉత్తర ప్రదేశ్లో వెలుగులోకి వచ్చింది.  ఈ  అత్యంత పాశవిక ఘటన ఉత్తర ప్రదేశ్లోని బద్రాస్  లో వెలుగులోకి వచ్చింది.  బీరమ్,  అంకుల్ అనే ఇద్దరు వ్యక్తులు ఏకంగా ఏళ్ల బాలికపై అత్యాచారానికి ఒడిగట్టి హత్య చేశారు.  అనంతరం ఈ అత్యాచారానికి కుట్ర చేసినా పరశురామ్ సునయన అనే దంపతులకు హత్యకు గురైన బాలిక గుండె కోసి ఇవ్వగా వాళ్ళు ఆ గుండెను తిన్నారు అని నిందితులు దర్యాప్తులో చెప్పడంతో పోలీసులు సైతం ఒక్కసారిగా షాకయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: