దేవుడా: 80 ఏళ్ల వయస్సులో మళ్లీ పెళ్లి.. హాజరైన ముని మనవలు..!
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మహరాష్ట్ర యవాత్మాల్ జిల్లాలోని శ్రీరామ్ హివ్రాలే(81), నిర్మలా ఇంగోల్(71) మొదటిసారి 1955 నవంబరు 16న వివాహం చేసుకున్నారు. అప్పటికి వారిద్దరు మైనర్లు కావడం గమనార్హం. ఈ ఏడాదితో వారి పెళ్లి జరిగి 65 ఏళ్లు పూర్తయ్యాయి. అయితే వివాహం గురించి వారికి పెద్దగా గుర్తు లేకపోవడంతో తామంతా కలిసి మళ్లి పెళ్లి చేయాలని నిర్ణయించినట్లు పెద్ద కుమారుడు పండ్లిక్ తెలిపారు. రెండో సారి జరిగిన ఈ పెళ్లికి పెద్ద కుమారుడితో పాటు వారి చిన్న కొడుకు పండిట్, పెద్ద చెల్లి తులిజా, కూతురు, మనుమలు హాజరయ్యారు. వివాహాలకు గోల్డెన్, సిల్వర్ జూబ్లీ నిర్వహించడం మనదేశంలో కొత్తేమి కాదు. అయితే ఈ పెళ్లికి మాత్రం ప్రత్యేకత ఉంది.
ఇక తమకు పెళ్లి చేయాలనే ఆలోచన తమ కుమార్తదే అని వృద్ధ దంపతుల చిన్నకుమారుడు పండిట్ అన్నారు. కుటుంబ సభ్యులకు వెంటనే అంగీకరిచండంతో ఈ వేడుకను నిర్వహించినట్లు ఆయన తెలిపారు. తల్లిదండ్రులు తమ చదువు, విజయం కోసం ఎన్నో కష్టాలు పడ్డారని, వారికి అభినందనలు తెలిపేందుకు ఈ ప్రత్యేకమైన వివాహ తంతును నిర్వహించామని స్పష్టం చేశారు. ఈ వివాహానికి కేవలం 50 మందిని మాత్రమే ఆహ్వానించారు. కోవిడ్-19 ప్రభావంతో అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యులను మాత్రమే ఆహ్వానించారు.