దారుణం : పిల్లలు చూస్తుండగానే తల్లి గొంతు కోశాడు.. చివరికి..?
ఈ దారుణ ఘటన ఉత్తర ప్రదేశ్ లోని ఆగ్రా లో చోటుచేసుకుంది. 30ఏళ్ల దంత వైద్యురాలు నిషా సింగల్ భర్త ఇద్దరు పిల్లలతో కలిసి ఆగ్రాలో నివాసం ఉంటుంది. ఈ క్రమంలోనే ఇటీవలే సెటప్ బాక్స్ రీఛార్జి చేస్తాను అంటూ శుభమ్ పాథక్ అనే వ్యక్తి ఇంటికి వచ్చాడు.. అదే సమయంలో ఇంట్లో భర్త లేకపోవడంతో వైద్యురాలు నిషా పై కత్తితో దాడి చేసి దారుణంగా గొంతుకోశాడు. పిల్లల ముందే తల్లి గొంతు కోయడంతో తీవ్ర భయాందోళనకు గురై అరుస్తున్న పిల్లలపై కూడా దాడి చేసాడు. ఆ తర్వాత గంట పాటు అక్కడే ఉన్న సదరు వ్యక్తి ఇంట్లో నుంచి బంగారం డబ్బు దోచుకుని పారిపోయాడు.
ఇక స్థానికులు ఇంటికి వచ్చి చూడగా రక్తపుమడుగులో వైద్యురాలు నిషా తో పాటు ఇద్దరు పిల్లలు కూడా కనిపించగా.. వెంటనే భర్త కు సమాచారం అందించారు భయపడిపోయిన భర్త ఇంటికి చేరుకుని భార్య పిల్లలను ఆస్పత్రికి తరలించారు. నిషాకు తీవ్ర గాయాలు కావడంతో అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ప్రస్తుతం పిల్లల పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితులని గమనించి పట్టుకునేందుకు ప్రయత్నించగా పోలీసులpai కాల్పులు జరిపాడు నిందితుడు. పోలీసుల ఎదురు కాల్పులు జరపగా గాయపడిన నిందితున్ని పట్టుకొని ఆసుపత్రిలో చేర్పించి ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు పోలీసులు.