పవన్ కి బిగ్ షాక్ ఇచ్చిన బి‌జే‌పి..ఇలా జరిగిందేంటి..!!

KISHORE
ఇటీవల జి‌హెచ్‌ఎం‌సి ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తానని ప్రకటించి మళ్ళీ బి‌జే‌పికి పూర్తి మద్దతు పలికారు జనసేన పార్టీ అద్యక్షుడు పవన్ కల్యాణ్. పవన్ బీజేపీ పార్టీ ఎం‌పి జి‌ఎం‌ఎల్ నరసింహరావు గారు  బిగ్ షాక్ తన ప్రకటన తో బిగ్ షాక్ ఇచ్చారు. తిరుపతి ఉప ఎన్నికలో పోటీ చేయాలని భావిస్తున్న జనసేనానికి మిత్ర పార్టీ బీజేపీ ఝలక్ ఇవ్వడం జనసేన పార్టీలో ఇకింత ఆశ్చర్యానికి లోనయ్యారు.
 తిరుపతి ఉప ఎన్నికలో బీజేపీనే పోటీ చేస్తుందని ఆ పార్టీ సీనియర్ నేత, ఎంపీ జి‌వి‌ఎల్ నరసింహరావు తేల్చి చెప్పారు. తిరుపతిలో తామే మాత్రమే పోటీ చేస్తామని వెల్లడించారు. తమ పార్టీ గతంలో తిరుపతిలో ఎంపీ స్థానంలో గెలిచిందని ఆయన గుర్తు చేశారు.మేము ఒంటరిగానే చేస్తామని తేల్చి చెప్పడంతో తిరుపతిలో పోటీపై బీజేపీ పూర్తిగా క్లారిటీగా ఉన్నట్లు తెలుస్తోంది. గ్రేటర్ ఎన్నికల్లో బి‌జే‌పికి పూర్తి మద్దతు తెలిపారు పవన్ కల్యాణ్.
ఎన్నికల పోటీ నుంచి నామినేషన్లు వెనక్కి తీసుకోవాలని కోరారు. ఇందుక ప్రతిఫలంగా తిరుపతి లోక్‌సభ స్థానాన్ని తమకు కేటాయించాలని బీజేపీ అగ్రనాయకులను అడిగేందుకే పవన్‌ ఢిల్లీకి వచ్చారని ప్రచారం జరుగుతోంది.మరి ఇప్పుడు జరుగుతున్నా పరిణామాల ధృష్ట్యా జనసేనానికి నిరాశే ఎదురయ్యేట్టు కనిపిస్తుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: