గ్రేటర్ యుద్దం : దమ్ముంటే సర్జికల్ స్టైక్స్ అక్కడ చేయండి..మండిపడ్డ అసరుద్దీన్..!!

KISHORE
 గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో రాజకీయ పార్టీలు హోరెత్తిస్తున్నాయి.నువ్వా నేనా అన్నట్టుగా రాజకీయ పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి.బి‌జే‌పి రాష్టా అద్యక్షుడు బండి సంజయ్ తాజా గా చేసిన వ్యాఖ్యలు పెను దుమారాన్ని రేపాయి.ఆయన ప్రచారంలో భాగంగా ప్రసంగిస్తూ బీజేపీ మేయర్ పీటం దక్కించుకున్న తర్వాత పాతబస్తీపై సర్జికల్ స్ట్రైక్ చేస్తామని చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదం అయ్యాయి.
 అయితే బండి సంజయ్ వ్యాఖ్యలపై స్పందించిన ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ బీజేపీకి 24 గంటల సమయం ఇస్తున్నామని, పాతబస్తీలో పాకిస్తాన్ వాళ్లెవరున్నారో చెప్పాలని ఘాటుగా స్పందించారు. 
భారత్ భూభాగంలో చైనా 970 చ.కి.మీల భూభాగాన్ని అక్రమించిందని దమ్ముంటే అక్కడకు వెళ్లి అమిత్‌షా సర్జికల్ స్ట్రైక్ చేయాలని అన్నారు.అంతేకాదు దేశంలో ఉన్నవాళ్లంతా భారతీయలేనని అన్నారు. దేశం నుంచి ముస్లింలను ఎవరూ వేరు చేయలేరని, దేశంలో అన్ని మతస్థుల వారికి, కులాల వారికి పుట్టినిల్లు అని ఆయన వ్యాఖ్యానించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: