రైతుల కష్టాలను చూసి ఫ్రీ గా అన్నం పెడుతున్న డాబా ఎక్కడుందో తెలుసా..!!
మొత్తానికి అనుకున్నది సాధించారు.శాంతి యుతంగా నిరసన చేసేందుకు పోలీసుల నుంచి అనుమతి పొందారు.ఇలాంటి పరిస్థితుల్లో ఢిల్లీ శివార్లలోని మార్తాల్లో ఓ దాబా యజమాని తన ఉదారత చాటుకున్నాడు. అన్నం పెట్టే రైతులపై పోలీసులు లాఠీలను ఎక్కుపెట్టారు..అయితే అందరి ఆకలిని తీరుస్తున్న రైతుల ఆకలిని ' ఆమ్రిక్ సుఖ్దేవ్’ అనే దాబా యజమాని మాత్రం వాళ్లకు అన్నం పెట్టి ఆకలి తీరుస్తున్నాడు..సుమారు రెండు వేల మంది రైతులకు సుఖ్ దేవ్ దాబా ఉచితంగా అన్నం పెట్టింది.
ఈ దేశానికి ఇచ్చిన వారి గురించి మాట్లాడితే.. రైతు కంటే గొప్పవాళ్లు ఎవరుంటారని ఆ దాబా యజమాని ప్రశ్నిస్తున్నారు. ముర్తాల్ వారికి భోజనం కొరతే ఉండదని.. ఎంత మంది రైతులు వచ్చినా కూడా వారందరికీ ఫ్రీగా అన్నం పెడుతానని ఆయన భరోసా ఇస్తున్నారు.ముర్తాల్ దాబాలో రైతులు భోజనం చేస్తున్న దృశ్యాలకు సంబంధించిన ఓ వీడియోను ‘యూత్ కాంగ్రెస్’ సోషల్ మీడియా ద్వారా షేర్ చేసింది. ఇప్పుడు ఆ వీడియో వైరల్గా మారింది. రైతుల కష్టాలను అర్థం చేసుకున్న పంజాబ్కు చెందిన ఆ దాబా యజమాని పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు..