హైదరాబాద్ ప్రజలు కొన్నేళ్లుగా పోలింగ్కు దూరంగా ఉంటున్నారు. అయితే ఇలాంటి పరిస్థితి ఉండకూడదని ఎన్నికల కమిషన్, జీహెచ్ఎంసీ అధికారులు ప్రజలందరూ ఓటు వేయాలంటూ విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు.అయితే ఓటు వేసే విషయంలో హైదరాబాదీలు మాత్రం పెద్దగా ఆసక్తి చూపడం లేదన్నది కాదనలేని వాస్తవం.ఎందుకంటే ఇప్పటివరకు గ్రేటర్లో ఓటింగ్ పర్సెంటేజ్ యాభై శాతం మించిన దాఖలాలు కనిపించలేదు. తెలుగు రాష్ట్రాల్లో అతి తక్కువ ఓటింగ్ నమోదయ్యే నగరం హైదరాబాద్ అంటేనే పరిస్థితి ఎలా ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.