చంద్రబాబు పై అనర్హత వేటు వేస్తారా..?
అసలు జరిగిన విషయం ఏంటంటే తిరుపతి అభ్యర్థి గా పనబాక లక్ష్మి ని చంద్రబాబు ఎంపిక చేశారు.. ఇక్కడ గెలుపు ధీమా తో ప్రచారం చేయడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు.. కానీ అనూహ్యంగా చంద్రబాబు ఎంత చెప్పినా ఆమె కాలు బయటపెట్టకపోవడం టీడీపీ క్యాడర్ ను కలవరపెట్టింది..అది ఇప్పుడు సద్దుమణిగిన అసెంబ్లీ లో చంద్రబాబు పై పడిన సస్పెన్షన్ వేటుపై ఇప్పుడు అన్తరా చర్చించుకుంటున్నారు.
టీడీపీ సభ్యులందరూ సస్పెన్షన్ కారణంగా బయటకు వెళ్లిపోయారు. ఆ తర్వతా అసెంబ్లీలో చంద్రబాబు ప్రవర్తనను ఖండిస్తూ తీర్మానం చేశారు. చంద్రబాబు వ్యవహారశైలిపై రూల్ 77 ప్రకారం చర్యలు తీసుకోవాలని మంత్రి బుగ్గన తీర్మానాన్ని ప్రవేశ పెట్టారు. దీన్ని పరిశీలనలోకి తీసుకుంటున్నామని స్పీకర్ తమ్మినేని ప్రకటించారు.అలాగే సరైన సమయంలో చర్యలు తీసుకుంటామని కూడా చెప్పేశారు. సభలో దురదృష్టకరమైన పరిణామం ఎప్పుడూ చూడలేదని.. ప్రతిపక్ష నేత కన్ఫ్యూజన్లో పడ్డారని తమ్మినేని సీతారాం విమర్శించారు. రాజ్యాంగ నిబంధనలను ప్రతి ఒక్కరూ పాటించాలని హితవు పలికారు. తీర్మానం చేసినందున ఇప్పుడు స్పీకర్ చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంది. గతంలో తెలంగాణ అసెంబ్లీలో గలాటా సృష్టించారని ఎమ్మెల్యేలుగా ఉన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సంపత్ల శాసనసభ్యత్వాలను స్పీకర్ మధుసూదనాచారి రద్దు చేశారు. ఇప్పుడు.. చంద్రబాబుపైనా అలాంటి చర్య తీసుకునే అవకాశాల్ని పరిశీలించవచ్చని అంటున్నారు.