గ్రేటర్ యుద్ధం : పోలింగ్ లో కొత్త పద్ధతి.. టిఆర్ఎస్ కు కలిసొచ్చేనా..?
ఈ క్రమంలోనే జిహెచ్ఎంసి ఎన్నికల నేపథ్యంలో ప్రస్తుతం అధికార టీఆర్ఎస్ పార్టీ హామీల వర్షం కూడా కురిపించింది అన్న విషయం తెలిసిందే. టిఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థులు అందరూ కూడా ముమ్మర ప్రచారం చేపడుతూ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే నువ్వా నేనా అంటూ సాగిన పోరుకు పరీక్ష నేడు జరుగనుంది. ఉదయం నుంచే ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఇక అన్ని పోలింగ్ కేంద్రాల్లో కూడా ప్రశాంతంగా పోలింగ్ జరుగుతోంది. ఇక మొన్నటివరకు ప్రచారం నిర్వహించి ఆకర్షించిన అభ్యర్థుల భవితవ్యాన్ని ఓటర్లు తేల్చనున్నారు.
కాగా దాదాపు 18 ఏళ్ల తర్వాత జీహెచ్ఎంసీ ఎన్నికలు మళ్లీ బ్యాలెట్ పద్ధతిలో ఓటింగ్ జరుగుతుండటంతో మరింత ఆసక్తికరం గా మారిపోయింది జిహెచ్ఎంసి ఎన్నికల పోలింగ్. అయితే ఈ కొత్త పద్ధతి ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీకి కలిసి వస్తుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారిపోయింది. కాగా నేడు జీహెచ్ఎంసీ పరిధిలోని 150 డివిజన్లలో ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఇక ఫలితాలు 4వ తేదీన వెల్లడికానున్నాయి అన్న విషయం తెలిసిందే. కాగా రాష్ట్రవ్యాప్తంగా 9101 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు ఎన్నికల అధికారులు.